English | Telugu

బ్లేడ్‌తో చేతులు కోసుకున్న బ్రహ్మాజీ!

వెన్నెల కిషోర్ ఆధ్వర్యంలో ప్రతీ వారం నవ్వుల్ని పంచుతున్న షో "అలా మొదలయ్యింది"..ఈ షోకి ఇప్పటి వరకు ఎంతో మంది సెలెబ్స్ వచ్చి ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ కి కమెడియన్ అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ అతని భార్య శాశ్వతి వచ్చారు. కిషోర్ వీళ్ళను ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాడు. తానూ తాను భార్యకు ఎలా లవ్ ప్రొపోజ్ చేసాడో చెప్పాడు. "ఇటు పక్క మూన్ లైట్, అటు పక్క సన్ రైజ్ ఆ టైంలో హైస్పీడ్ వాక్ తో అలా నడుచుకుంటూ వెళ్లి ఐ లవ్ యు చెప్పేసాను. అలాగే తన బర్త్ డేకి నా చైన్ తాకట్టు పెట్టాను." అని చెప్పారు బ్రహ్మాజీ.

తమ ప్రేమ పెళ్లికి డైరెక్టర్ కృష్ణవంశీ కారణం అని ..ఆయనే కన్యాదానం చేసినట్లు బ్రహ్మాజీ - శాశ్వతి చెప్పారు. " మీరు ఫోన్ లో మాట్లాడుకున్న సమయం ఎంత" అని కిషోర్ అడిగేసరికి " ప్రేమలో ఉన్నప్పుడు పబ్లిక్ బూత్‌ల దగ్గరే సమయమంతా గడిపే వాడినని" బ్రహ్మాజీ చెప్పారు. "మీకో సీక్రెట్ చెప్తానంటూ శాశ్వతి బ్రహ్మాజీ చెయ్యి తీసుకుని చూపించింది. ఆ చెయ్యి మీద ఒక బ్లేడ్ తీసుకుని చాలా పొడవుగా కట్ చేసేసుకున్నాడు..నేనే అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సి వచ్చింది " అని చెప్పి చూపించింది. "నాయనా నువ్వు ఇంత వయొలెంట్ ఏమిటి అని అడిగాడు" కిషోర్. "మేడం తిట్టేటప్పుడు మీరు వింటారా" అనేసరికి "బైక్ స్టార్ట్ అవగానే నేను కార్ తీసుకుని వెళ్ళిపోతాను" అని చెప్పాడు. "ఈరోజు నేను మీలో ఒక సద్గురుని చూస్తున్నా" అన్నాడు కిషోర్. "కుక్కపిల్లకు బిస్కెట్ వేసి దా దా అంటే ఎలా ఫాలో అవుతుందో నేను అలాగే ఫాలో ఐపొతూ వెళ్తాను" అని చెప్పాడు. "నీకు శాశ్వతికి చాలా హ్యాపీగా ఉంది కదా నన్ను తిడుతూ ఉంటే అని కొంచెం ఫీలయ్యాడు బ్రహ్మాజీ. నిన్ను ఒక్కసారి తిడితే మళ్ళీ మూడు రోజులు భోజనం చెయ్యవు" అని అన్నాడు. మే 2న ప్రసారమయ్యే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. బ్రహ్మాజీ బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బ్రహ్మాజీ గులాబి, నిన్నే పెళ్లాడతా, సింధూరం వంటి మూవీస్ తో కెరీర్ స్టార్ట్ చేసి మంచి పాపులారిటీ వచ్చింది. తర్వాత పదేళ్లపాటు ఎన్నో రకాల క్యారెక్టర్స్ లో చేసాడు. ఇప్పుడు మాత్రం కమెడియన్ గా, సహాయ నటుడిగా, నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న రోల్స్ లో నటిస్తున్నాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.