English | Telugu

అక్కడ షో మానేసి ఇక్కడ స్టార్ మాలో ఎంట్రీ...పల్లవితో ముచ్చట్లు, డాన్స్ లు  

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ వారం ఫుల్ ఎంటర్టైన్ చేసింది. అందులోనూ ఇమ్మానుయేల్ - పల్లవి ఎపిసోడ్ ఫుల్ జోష్ తో సాగింది. హోలీ స్పెషల్ ప్రోగ్రాంగా ప్రసారమైన ఈ ఎపిసోడ్ లో ఒక్కొక్కరి మీద రంగులు వేసుకున్నారు లేదు పూసుకున్నారు. ఈ ఎపిసోడ్ లో ఇమ్ము షో మొత్తాన్ని కబ్జా చేయడానికి ట్రై చేసాడు. ఐతే ఇమ్ముని స్పెషల్ గా ట్రీట్ చేసింది శ్రీముఖి. "ఇమ్ము నీతో నేను ఫ్రెష్ గా మాట్లాడాలి. ఏంటి అక్కడ షోలో మానేసావని తెలిసింది..వెల్కమ్ టు స్టార్ మా..ఇక్కడ చేస్తున్నావంటే అక్కడ మానేసినట్టే కదా. ఈ ఛానెల్ లోకి వచ్చావ్. అంటే ఇక నీకు రంగులే " అని చెప్తూ ఇన్వైట్ చేసింది. ఆ మాటలకు షాకయ్యాడు ఇమ్ము.

ఐతే షోలో ఉన్న ఐదుగురు అమ్మాయిల్లో పల్లవి అంటే ఇష్టం అని చెప్పేసరికి "పెళ్ళెప్పుడు..అసలే జుట్టు మొత్తం ఊడిపోతోంది" అని అడిగింది శ్రీముఖి. పెళ్లి త్వరలో ఈ స్టేజి మీదనే జరుగుతుంది అని చెప్పాడు ఇమ్ము. ఇక రోహిణి బాగా చూసుకుంటాను అని చెప్పి అక్కడ నుంచి ఇక్కడికి తెచ్చింది అంటూ చెప్పాడు ఇమ్ము. ఇక సాంగ్స్ టాస్క్ లో గెలిచినందుకు యాదమ్మ రాజు, ఇమ్ముని వెళ్లి రంగులు పోయామని చెప్పేసరికి రాజు వెళ్లి పల్లవి బుగ్గ మీద రంగు పూశాడు. దాంతో ఇమ్ముకి ఫుల్ కోపం వచ్చేసింది. రాజు, ఇమ్ము నా పిల్ల అంటే నా పిల్ల అంటూ అర్జున్ రెడ్డిలా ఫీలవుతూ కాసేపు అరుచుకున్నారు. "పల్లవి నీ కోసం అన్నీ మానేసి వచ్చా ఇదన్నా ప్లీజ్ ..చూసేవాళ్ళందరికీ వీడికి అక్కడ బానే ఉంది అని అనుకోవాలి కదా" అన్నాడు. ఇమ్ము తన బుగ్గకు రంగు రాసుకుని పల్లవితో డాన్స్ చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేసాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.