English | Telugu

Brahmamudi : రాజ్ బ్రతికే ఉన్నాడంటూ కావ్య ఛాలెంజ్.. అతను పిండప్రధానం చేయగలిగాడా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -671 లో... రాజ్ వెళ్తున్న కార్ వెనకాలే కావ్య పరిగెత్తుకొని వెళ్తుంది. రాజ్ ఒక దగ్గర ఆగుతాడు. యామిని కార్ దిగి షాప్ కి వెళ్తుంది. కావ్య సరిగా రాజ్ దగ్గరికి వచ్చి స్పృహ కోల్పోతుంది. దాంతో రాజ్ తన కార్ లో హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు. తనెవరో తెలియదని డాక్టర్ కి రాజ్ చెప్తాడు. యామిని ఫోన్ చేసి ఎక్కడికి వెళ్ళావ్ త్వరగా రా.. నువ్వు ఇక్కడికి వచ్చేవరకు నేను ఇక్కడే ఉంటానని యామిని అనడంతో రాజ్ బిల్ కట్టేసి వెళ్ళిపోతాడు. కావ్య స్పృహలోకి వచ్చి రాజ్ గురించి అడగ్గా ఇప్పుడే బిల్ కట్టి వెళ్ళారని రిసెప్షన్ లో చెప్తారు.

ఆ తర్వాత రాజ్ చనిపోయాడని కావ్యకి అర్థమయ్యేలా చెప్పండి అని రుద్రాణి ఇంట్లో వాళ్ళతో అంటుంటే.. లేదు మా ఆయన బ్రతికే ఉన్నాడని కావ్య అంటుంది. ఎవరు నమ్మలేదు కదా చివరకు నా నమ్మకం నిజం అయింది. నా సంకల్పo గెలిచింది.. ఇందాక మా ఆయనని చూసానని కావ్య చెప్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తారు. నేను స్పృహ తప్పి పడిపోతే, ఆయనే నన్ను హాస్పిటల్ లో చేర్పించారని కావ్య అంటుంది. నిన్ను చూసినవాడు. ఇంటికి రాకుండా ఎలా ఉంటాడు. ఇక పిచ్చి బాగా ముదిరింది వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్లి ట్రీట్ మెంట్ చేపించాలి లేదంటే చాలా కష్టమని రుద్రాణి అంటుంది. కావ్య చెప్తుంటే అందరు కావ్య అయ్యో పాపం అంటు దీనంగా చూడడం తప్ప ఎవరు నమ్మరు. మా ఆయన బ్రతికే ఉన్నాడని చెప్తే ఎవరు నమ్మట్లేదు కదా ఆయనను తీసుకొని రాకుంటే నా పేరు కావ్యనే కాదని కావ్య ఛాలెంజ్ చేస్తుంది.

యామిని దగ్గరికి తన పేరెంట్స్ వస్తారు. ఏం చేస్తున్నావని వాళ్ల నాన్న అడుగగా.. రాజ్ ఐడెంటిటీ మారుస్తున్నానని యామిని అంటుంది. ఐడెంటిటీ మార్చినంత మాత్రనా రాజ్ మారుతాడా.. గతం గుర్తు వస్తే క్షమించడు అని వాళ్ళ నాన్న అంటాడు. అందుకే ఫారెన్ తీసుకొని వెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నానని యామిని అంటుంది. తరువాయి భాగంలో రాజ్ కి సుభాష్ పిండప్రధానం చేస్తుంటే.. కావ్య వచ్చి నా భర్త బ్రతికే ఉన్నాడు. తండ్రి అయినా సరే మీకు అర్హత లేదని కావ్య సుభాష్ తో అంటుంది. రాజ్ ఫోటోని కావ్య అక్కడ నుండి తీస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.