English | Telugu

ఆ పనిలో లేజీ కాదు.. అసలు విషయం చెప్పేసిన సంధ్య

నీతోనే డాన్స్ ఈ వారం అసలైన రౌండ్ స్టార్ట్ అయ్యింది. ఇక ప్రతీ శనివారం తగ్గేదేలే టీమ్, ఆదివారం తస్సాదియ్యా టీమ్ వస్తుంది అని చెప్పింది శ్రీముఖి. తగ్గేదేలే టీమ్ నుంచి బ్రిట్టో-సంధ్య, మానస్ నాగులపల్లి - శుభశ్రీ రాయగురు, శిశిర్-షిరిన్, కుమార్ సాయి - శ్వేతా, నితిన్ - అక్షిత్. ఇక స్టార్టింగ్ బ్రిట్టో-సంధ్య ఇద్దరూ వచ్చి మంచి పెర్ఫార్మెన్స్ చేశారు.

సాంగ్ తర్వాత వీళ్లకు ఒక టాస్క్ ఇచ్చింది శ్రీముఖి. "ఇద్దరిలో ఎవరు ఎక్కువగా లేజీగా ఉంటారు" అని అడిగితే ఇద్దరం అని చెప్పారు.. "ఎవరు ముందు గొడవ స్టార్ట్ చేస్తారు" "సంధ్య" అనే బ్రిట్టో చెప్పాడు .. ఆమె కూడా తానే అని చెప్పుకుంది. యూనివర్సల్ గా గొడవ అంటే ఆడవాళ్లే స్టార్ట్ చేస్తారు అని చెప్పింది శ్రీముఖి. "ప్రేమించేటప్పుడు ఫుల్ ప్రేమ చూపిస్తారు పెళ్లయ్యాక కొంచెమే చూపిస్తారు..అందుకే అటెన్షన్ కోసం గొడవ పడుతూ ఉంటాం" అని చెప్పింది సంధ్య. "ఎవరు రొమాన్స్ లో ముందు.." అని అడగడంతో ఇద్దరం అని చెప్పారు. తర్వాత సంధ్యా బ్రిట్టోని గట్టిగా ముద్దు పెట్టేసుకుంది .."మరి నువ్వేలా రొమాన్స్ చేస్తావో చూపించు" అని శ్రీముఖి బ్రిట్టోని అడిగింది " నేను పబ్లిక్ లో అవన్నీ చూపించలేను" అని చెప్పేసాడు. "ఎనిమిది నెలలే అయ్యింది మీ పెళ్ళై" అని శ్రీముఖి అనేసరికి తెలుగు అర్ధం కానీ బ్రిట్టో "ఎనిమిది నెలలా" అని అనుమానంతో సంధ్యను అడిగాడు. తర్వాత శ్రీముఖి క్లారిటీ ఇచ్చింది. ఇంతలో రాధ ఎంట్రీ ఇచ్చి అందుకే లేజీ, లేజీ అన్నారు అంటూ నవ్వేసింది. ఇక సంధ్య వచ్చి "లేదు లేదు.. ఆ విషయంలో లేజీ కాదు" అని చెప్పేసరికి "అందరికీ అన్ని విషయాలు చెప్పకూడదు" అని బ్రిట్టో ఆమెను ఆపేసాడు. ఇక తరుణ్ మాస్టర్ ఆ టాపిక్ ని వేరేగా మార్చేశారు. "పగలు మాత్రమే బ్రిట్టో లేజీగా ఉంటాడు" అని కవర్ చేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.