English | Telugu

‘పాడుతా తీయగా’ సింగర్ ఆశ్రిత్ కు హేమచంద్రకి ఉన్న రిలేషన్ తెలుసా?

‘పాడుతా తీయగా’ సింగర్ ఆశ్రిత్ కు సింగర్ హేమచంద్రకి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?పాడుతా తీయగా..అనే షో ఈటీవీలో ఎంతో ఫేమస్. 1996 లో ఈ షో మొదలైంది. ఈ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమాల్లో పాటలు పాడే అవకాశాలను కూడా దక్కించుకున్నారు. ఇంకొంతమందైతే నటీనటులకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నారు.

ఈ షోని ఒకప్పుడు బాలు గారు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోవడంతో ఆయన స్థానంలో ఆయన తనయుడు చరణ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షో సీజన్ - 20 ద్వారా టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచి 4 లక్షల క్యాష్ ప్రైజ్ గెలుచుకుని పాపులర్ అయిన పిల్లాడు ఆశ్రిత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమే. ఈ కుర్రాడు పాట పాడే విధానం చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.

ఐతే ఈ కుర్రాడు స్టార్ సింగర్ హేమచంద్రతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇద్దరికీ ఉన్న రిలేషన్ ఏమిటి అనుకుంటున్నారా ? ఆశ్రిత్ రాఘవ మరెవరో కాదు హేమచంద్రకి మేనల్లుడు. హేమచంద్ర అక్క హిమబిందు పెద్ద కొడుకే ఈ ఆశ్రిత్. మరి ఫ్యూచర్ లో ఈ కుర్రాడు కూడా మేనమామలా మంచి సింగర్ అయ్యే అవకాశం ఉంది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.