Read more!

English | Telugu

తిరుపతిలో చీతాను చూసిన ప్రియాంక జైన్, శివ్

ప్రియాంక జైన్- శివ్ కుమార్ వీళ్ళిద్దరూ బుల్లితెర మీద ఆడియన్స్ కి బాగా పరిచయం. ఇద్దరూ కలిసి సీరియల్స్ లో నటించారు. అలాగే ప్రియాంక రీసెంట్ గా బిగ్ బాస్ సీజన్ 7 లోకి కూడా వెళ్లి వచ్చింది. అలాంటి వీళ్ళిద్దరూ ఇప్పుడు తిరుపతి వెళ్లారు. ప్రియాంక ఛానల్ కి 700k ఫాలోవర్స్ వచ్చారని చెప్పి సెలెబ్రేషన్స్ చేసుకోవడం కోసం తిరుపతి వెళ్లారు. శివ్ ఆ విషయం చెప్పేసరికి ఫాలోవర్స్ వచ్చారనేది కూడా ఒక రీజన్ కానీ కొండా ఎక్కడానికి మనసు ఉండాలి అని చెప్పింది. ఇక అందరూ కర్రలు తీసుకుని కొండ మీదకు బయల్దేరి వెళ్లారు. ప్రియాంక అక్కడ చీతాని చూడాలనుకుంటున్నట్టు తన కోరికను ఎక్స్ప్రెస్ చేసేసరికి శివ్ కి కోపం వచ్చేసింది. 

"ప్రియాంక గారికి చీతా చూడాలని ఉంది కాబట్టి చీతా రావాలని కోరుకుంటున్నారు..చీతా వస్తే తరిమి కొట్టడానికి ఇంత పెద్ద పెద్ద కర్రలు తీసుకుని వెళ్తుంటే చీతా రావాలని కోరుకుంటున్నావా" అని శివ్ అడిగేసరికి ప్రియాంక పాపం ఫీలైపోయింది". తర్వాత అక్కడ ఒక బండి హెడ్ లైట్స్ చూసేసరికి అది నిజంగా చీతా అనుకుని ఇద్దరూ పరుగులు తీశారు. చివరికి కాదు అని చిరుత పులి కాదు అని తెలుసుకుని తెగ నవ్వుకున్నారు. "ఇంత భయమా నీకు ప్రియాంక" అని శివ్ అడిగేసరికి "అది వచ్చి నిన్ను తినేస్తే" అని ప్రియాంక అడిగింది .."మరెందుకు చీతా రావాలని అనుకున్నావ్" అని అడిగాడు. "టెన్షన్ పోతుంది కదా అదొస్తే" అని అంతే అని చెప్పింది ప్రియాంక. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మోకాళ్ళ పర్వతం దగ్గర మోకాళ్ళ మీద మెట్లెక్కారు. ఇలా తిరుపతి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని వచ్చారు.