English | Telugu

Illu illalu pillalu : శ్రీనివాసరావు నిజం చెప్తాడా.. భాగ్యంకి మొదలైన డౌట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -392 లో.. రామరాజు కుటుంబం గుడికి వెళ్తారు. అదే గుడికి శ్రీనివాసరావు వస్తాడు. సాగర్ కి జాబ్ వచ్చిందని తన పేరున అర్చన చేయించడానికి శ్రీనివాసరావు వస్తాడు. అదే గుడికి అమూల్య, విశ్వ కూడా వస్తారు. ప్రేమ, ధీరజ్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఎగ్జామ్ అంటే బాగుండదని ప్రేమ అంటుంది. అదేం లేదు నోటిఫికేషన్ పడినప్పుడే ఎగ్జామ్ రాయాలని ధీరజ్ అంటాడు.

అమూల్య వాళ్ళని ధీరజ్ చూసి ఇప్పుడు వాళ్ళని నాన్న చూస్తే డిస్టబ్ అవుతాడు. వెంటనే ఇక్కడ నుండి తీసుకొని వెళ్లాలని ప్రేమతో ధీరజ్ అంటాడు. నాన్న ఇంటికి వెళదామని రామరాజు వాళ్ళని ధీరజ్ తీసుకొని వెళ్తుంటే పొర్లు దండాలు పెడుతూ శ్రీవల్లి కన్పిస్తుంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావని రామరాజు అడుగుతాడు. మీరు బాగుంటే ఇలా చేస్తానని మొక్కుకుందని భాగ్యం అంటుంది. అప్పుడే శ్రీనివాసరావు స్వీట్ పంచుతూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. నాన్న స్వీట్ ఏంటి అని నర్మద అడుగుతుంది. అదే సాగర్ కి అని చెప్పబోతు నర్మద సైగ చెయ్యగానే అతను ఆగిపోతాడు. అదే సాగర్ నువ్వు అన్యోనంగా ఉంటున్నారు కదా అందుకే అని శ్రీనివాసరావు అంటాడు. అది కాదేమోనని భాగ్యం అంటుంది. తన వంక నర్మద కోపంగా చూస్తుంది.

అప్పుడే రామరాజుని అమూల్య చూసి.. నాన్న అంటూ దగ్గరికి వస్తుంది. మనకి వాళ్లతో ఏంటని రామరాజు వాళ్ళని తీసుకొని వెళ్తుంది వేదవతి. మరొకవైపు ఆ విశ్వగాడు మాట్లాడుతానని చెప్పి పెళ్లి చేసుకొని నాకు ఇంత టెన్షన్ పెట్టాడని శ్రీవల్లి కోపంగా విశ్వ దగ్గరికి వెళ్తుంది. నేను పెళ్లి చేసుకోలేదు.. అదే తాళి మెడలో వేసుకుంది దాని వెనకాల ఉండి ఇదంతా ఎవరో చేయిస్తున్నారని విశ్వ అనగానే శ్రీవల్లి, భాగ్యం వాళ్ళు షాక్ అవుతారు. ఇంటికి వచ్చాక అసలు దీని వెనకాల ఎవరు ఉన్నారని భాగ్యం, శ్రీవల్లి ఆలోచిస్తారు. అప్పుడే ప్రేమ, నర్మద వస్తారు ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.