English | Telugu

Karthika Deepam2 : షాక్ లో పారిజాతం.. తను వారసురాలు కాదనే నిజం చెప్తుందా!


స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -591 లో.. శ్రీధర్, కావేరి, స్వప్న ముగ్గురు గుడికి వెళ్ళడానికి రెడీ అవుతారు. శ్రీధర్ వెళ్లి కార్ లో కూర్చుంటాడు. డ్రైవింగ్ సీట్ లో కూర్చోలేదని స్వప్న అడుగుతుంది. ఇక నుండి కొత్త డ్రైవర్ ని చూసానని కాశీని పిలుస్తాడు శ్రీధర్. తనని చూసి స్వప్న కార్ దిగుతుంది. ఇకనుండి ఇతనే మన డ్రైవర్ అని శ్రీధర్ అంటాడు. అలా అయితే ఈ క్షణమే ఇంట్లో నుండి వెళ్ళిపోతానని స్వప్న కోపంగా లోపలికి వెళ్తుంది. మరోవైపు జ్యోత్స్న సాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని డాక్టర్ చెప్పి బయటకు వస్తుంది . డాక్టర్ బయటకు రాగానే దీప, కార్తీక్ సాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పినందుకు థాంక్స్ అని డాక్టర్ కీ చెప్తారు కానీ ఆపరేషన్ అవ్వదు కదా అని డాక్టర్ అంటుంది. లేదు అవుతుంది. నేను నా బిడ్డని వదులుకోవడానికి సిద్ధం అని దీప అనగానే అది నిర్ణయం మాత్రమే కాదు.. నీ భర్తది కూడా అని డాక్టర్ అంటుంది.

నా భార్య నిర్ణయమే నా నిర్ణయం అని కార్తీక్ అంటాడు.అలా ఎందుకు అని డాక్టర్ కోప్పడుతుంది. ఆ పరిస్థితిలో మీ అమ్మ ఉంటే ఏం చేసేవారు డాక్టర్ మీ అమ్మ ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసేవాళ్ళు కదా అని దీప అనగానే నిన్ను కన్న సుమిత్ర చాలా అదృష్టవంతురాలు అని డాక్టర్ అంటుంది. మరొకవైపు డాక్టర్ చెప్పింది విని పారిజాతం ఇంకా షాక్ లోనే ఉంటుంది. అంటే ఆ సైదులు గాడు నన్ను మోసం చేసాడు బిడ్డని మార్చలేదు పైగా నా మనవరాలిని నేనే చంపుకున్నానన్న మాట అని పారిజాతం అంటుంది. గ్రానీ అవన్నీ నమ్మకని జ్యోత్స్న అంటుంది. నువ్వు నన్ను అలా పిలవకు.. నువ్వు నా మనవరాలు అనుకుని నీకేదో నేను హెల్ప్ చెయ్యాలని ట్రై చేస్తున్నానని పారిజాతం అంటుంది.

ఇక నీకేం సమస్య.. సుమిత్ర కన్నబిడ్డ నువ్వే కదా అని పారిజాతం అంటుంది కానీ జ్యోత్స్న మాట అసలు వినిపించుకోదు. మరొకవైపు దీప, కార్తీక్ చాలా బాధపడతారు. ఆ తర్వాత జ్యోత్స్నని పక్కన కూర్చొపెట్టుకుంటుంది సుమిత్ర. ఆ తర్వాత దీపకి స్వీట్ తినిపిస్తుంది సుమిత్ర. మీకేం కాదమ్మా అని దీప అనగానే నా కూతురు నన్ను బ్రతికిస్తుందని జ్యోత్స్న ని ఉద్దేశ్యించి సుమిత్ర చెప్తుంది. పారిజాతం మాత్రం ఇంకా షాక్ లోనే ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.