Read more!

English | Telugu

హౌస్ నుండి ఎలిమినేట్ అయిన నేహా!

బిగ్ బాస్ లో ప్రతీ వారం చివరలో ఒక ఎలిమినేషన్  ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తిరంగా సాగింది.

నాగార్జున హౌస్ మేట్స్ అందరితో కొన్ని గేమ్స్ ఆడించాడు. మొదటగా 'సుత్తి గేమ్' ఆడించాడు. ఆ తర్వాత నామినేషన్లో ఉన్నవాళ్ళకి ఎన్వలప్స్ ఇచ్చాడు. అందులో ఏ ఇద్దరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్లు సేఫ్ అని అన్నాడు. తర్వాత గీతు, శ్రీహాన్  దగ్గర ఎక్కువ డబ్బులు ఉండటం వల్ల ఇద్దరు సేఫ్ అయ్యారు. తర్వాత 'సుత్తి గేమ్', 'జంగిల్ బుక్ లో జంతువులు' లాంటివి ఆడించాడు. వీటి తర్వాత మళ్ళీ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగింది. చివరగా వాసంతి, నేహ మిగిలారు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ "త్రాసులో బరువు ఉంచుతాను ఎవరి ఫోటో ఉన్న త్రాసు పైకి లేస్తుందో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు" అని చెప్పాడు. తర్వాత నేహా ఎలిమినేట్ అయింది అని ప్రకటించాడు. తన పేరు విన్నాక నేహా షాక్  అయింది. ఆ తర్వాత ఉద్వేగానికి లోనైంది.

హౌస్ మేట్స్ అందరూ కన్నీటితో వీడ్కోలు చెప్పారు. తర్వాత 'అందరూ బాగా ఆడండి' అని హౌస్ మేట్స్ కి చెప్పి, నాగార్జున దగ్గరకు వచ్చేసింది నేహ. స్టేజ్ మీదకి వచ్చిన నేహాకి తన 'ఏవి' చూపించాడు నాగార్జున. ఆ తర్వాత నేహాని " హౌస్ లో దుమ్ము కంటెస్టెంట్స్ ఎవరు?, దమ్మున్న కంటెస్టెంట్స్ ఎవరు? ఎందుకు? " అని నాగార్జున అడిగాడు. "దుమ్ము కంటెస్టెంట్స్ ఇనయ, రేవంత్, ఆరోహి, అర్జున్, గీతు, వాసంతి అని చెప్పింది. దమ్ము కంటెస్టెంట్స్ చంటి, సుదీప, ఆదిత్య, ఆదిరెడ్డి, శ్రీసత్య, రాజ్" అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఒక్కొక్కరి గురించి చెప్పమన్నాడు నాగార్జున. "రేవంత్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పింది. నేను నమ్మిన వాళ్ళే, నాతో ఉన్నవాళ్ళే నన్ను ఈ స్థానంలో ఉంచారని కాస్త భావోద్వేగానికి గురైంది. చంటి చాలా కనెక్ట్ అయ్యాడు. ఆదిత్య చాలా స్ట్రాంగ్. సుదీప నాకు ఫ్యామిలీ లాగా అనిపిస్తుంది. శ్రీహాన్ అందరిని మంచిగా కలుపుకుపోతూ ఉంటాడు. 'ఒక కామన్ మ్యాన్ గా వచ్చి హౌస్ లీడర్ అయ్యాడు. One more step to go' అని ఆదిరెడ్డితో చెప్పింది. శ్రీసత్య మై స్వీట్ హార్ట్ అంది. రాజ్ తో నాకు మంచి కనెక్షన్ ఏర్పడింది. మంచి స్నేహితులుగా ఉన్నాం. నాకు చాలా దగ్గరగా వచ్చాడు" అని చెప్పుకొచ్చింది నేహ. మూడవ ఎలిమినేషన్ గా  నేహ బిగ్ బాస్ నుండి బయటకు వచ్చేసింది.