English | Telugu

Karthika Deepam2 : కార్తీక్ కి నిజం చెప్పేసిన దాస్.. దీపే అసలైన వారసురాలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కార్తీక దీపం2(Karthika Deepam2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -353 లో.... జ్యోత్స్నని దీపకి బ్లడ్ ఇవ్వమని కార్తీక్ రిక్వెస్ట్ చేస్తాడు. దొరికింది ఛాన్స్ అన్నట్లు గా నువ్వు ఈ పేపర్స్ పై సంతకం పెడితే నువ్వు చెప్పింది చేస్తానని జ్యోత్స్న బ్లాక్ మెయిల్ చేస్తుంది. అప్పుడే డాక్టర్ ఫోన్ చేసి కార్తీక్ ఏమైంది డోనార్స్ వచ్చారా అని అడుగుతుంది. హా వస్తున్నారని కార్తీక్ చెప్తాడు. ఇక వేరే దారిలేక జ్యోత్స్న ఇచ్చిన పేపర్స్ పై కార్తీక్ సంతకం చేస్తాడు. జ్యోత్స్న చిటికె వెయ్యగానే డోనార్స్ వస్తారు.

ఆ తర్వాత వాళ్ళని కార్తీక్ లోపలికి తీసుకొని వెళ్తాడు. జ్యోత్స్న, కార్తీక్ ఇద్దరు మాట్లాడుకుంది అంతా దాస్ చూస్తాడు. ఈ పేపర్స్ నీ జీవితాన్ని ఎలా మార్చుతాయో చూద్దాం బావ అని జ్యోత్స్న అనుకుంటుంది. కాసేపటికి దీప సేఫ్ అని డాక్టర్ వచ్చి చెప్తాడు. ఇక మీరు ఇంటికి వెళ్ళండి శౌర్య చూస్తుంటుందని అనసూయ, కాంచనలని కార్తీక్ ఇంటికి పంపిస్తాడు. కార్తీక్ టాబ్లెట్స్ తీసుకొని రావడానికి వెళ్తాడు‌ అక్కడ కార్తీక్ తో దాస్ మాట్లాడతాడు. నీతో ఒక విషయం చెప్పాలని అంటాడు. సుమిత్ర, దశరథ్ ల కూతురు దీపనే.. జ్యోత్స్న కాదని దాస్ చెప్పగానే కార్తీక్ షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ మావయ్య అని కార్తీక్ అడుగుతాడు. నేను చెప్పేది నిజం అని దాస్ అంటాడు. అయితే జ్యోత్స్న ఎవరని కార్తీక్ అడుగుతాడు. జ్యోత్స్న నా కూతురు అని దాస్ చెప్పగానే కార్తీక్ అయోమయంలో పడుతాడు.

దాస్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ పారిజాతం పిల్లల్ని మార్చిన విషయం చెప్తాడు. దీపే అసలైన వారసురాలు అని దాస్ చెప్తాడు. దాంతో కార్తీక్ చిన్నప్ప్పుడు కార్తీక్ ని దీప కాపాడిన విషయం గుర్తుచేసుకుంటాడు. నాకు ఈ విషయం తెలిసినా కూడ ఎవరికి చెప్పలేని సిచువేషన్ ఎవరికైనా చెప్తే చనిపోతానని జ్యోత్స్న బెదిరించిందని దాస్ జరిగింది మొత్తం చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.