English | Telugu

నా హీరోకి ఏ దేవుడు సూపర్ పవర్స్ ఇవ్వలేదు.. కష్టపడి తెచ్చుకున్నాడు


బుల్లితెర మీద పలు ఈవెంట్స్ లో సందడి చేసే అష్షు రెడ్డి, గుప్పెడంత మనసు సీరియల్ తో హిట్ యాక్ట్రెస్ గా పేరు తెచ్చుకున్న జగతి మేడం అలియాస్ జ్యోతి రాయ్ సుకు పూర్వజ్ డైరెక్ట్ చేసిన “ఏ మాస్టర్ పీస్” మూవీలో కనిపించబోతున్నారు. "శుక్ర, మాటరాని మౌనమిది" వంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత సుకు అరవింద్ కృష్ణ , అషు రెడ్డి లీడ్ రోల్స్ తో ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నాడు. అలాంటి సుకు పూర్వజ్ ఇప్పుడు తన మూవీ గురించి తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఇలా పోస్ట్ చేసుకున్నాడు.

"ఏ మాస్టర్ పీస్ మూవీలో నా హీరోకి ఏ దేవుడు కూడా సూపర్ పవర్స్ ఇవ్వనే ఇవ్వడు..హీరోకి ఉన్న పవర్స్ అన్ని కూడా కష్టపడి సంపాదించుకున్నవే..ఆ పవర్స్ ని ఎలా సంపాదించుకున్నాడనే సబ్జెక్టు ఈ స్టోరీ. కొంచెం టైం వెయిట్ చేయండి.

ఈ ఇయర్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం" అంటూ పెట్టిన పోస్ట్ ని జ్యోతి రాయ్, అషూ రెడ్డి కూడా వాళ్ళ వాళ్ళ స్టేటస్ లో పోస్ట్ చేసుకున్నారు. అలాగే జ్యోతి రాయ్ కూడా మరో ఇన్స్టా స్టేటస్ పెట్టింది. "ఫేజ్ 1 శివమ్ : ఇన్ హౌస్ సీక్రెట్స్ అండ్ ది రైజ్ ఆఫ్ ఏ.. టీజర్ త్వరలో రాబోతోంది...ఈ మూవీ పనులన్నీ పూర్తయ్యాయి.. పాన్ ఇండియా లెవెల్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది" అని చెప్పింది. ఇక గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్న జ్యోతి రాయ్ "దేవర" మూవీలో స్తానం సంపాదించింది.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.