English | Telugu

Brahmamudi:అర్థరాత్రి ఆమె గదిలోకి దూరింది ఎవరు.. ఆపదలో ఉన్న శ్వేతని రాజ్ కాపాడగలడా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -310 లో.. కావ్య అర్థరాత్రి వరకు ఇంట్లో పని చేస్తుంటుంది. అప్పుడే స్వప్న వచ్చి.. నువ్వు ఈ ఇంటికి కోడలివా? పనిమనిషివా ఎందుకు ఇలా చాకిరి చేస్తున్నావ్? ఈ ఇంటి కోడలు అన్న విషయం అందరు మర్చిపోయి.. నిన్ను ఒక పని మనిషిని చేశారు. దానికి తోడు అందరూ నిన్ను తిట్టేవాల్లే.. అలాంటప్పుడు ఎందుకు ఇన్ని పనులు చెయ్యడమని కావ్యని స్వప్న అంటుంది. మన కుటుంబం కోసం నేను చేస్తున్నాను ఇందులో తప్పేముందని కావ్య అంటుంది. నువ్వు ఎదరుతిరుగు.. అన్ని మాటలు పడుతుంటావ్. నీ మంచి గురించి చేప్తున్నానంటు కావ్యకి స్వప్న సపోర్ట్ గా మాట్లాడుతుంది.

ఆ తర్వాత కనకం ఇంటికి శుభలేక పట్టుకొని ఒక ఆవిడ వస్తుంది. అబ్బాయేం చేస్తాడని కనకం అడిగినందుకు. మీ అల్లుల్లలాగా కోటీశ్వరులు కాదు చిన్న జాబ్. అయిన నీ అంత తెలివి తేటలు లెవ్వు. నువ్వు నీకున్న తెలివితో వాళ్లపై ఉసిగొలిపి అల్లుళ్లని చేసుకున్నావ్. అంతే కాకుండా అప్పుని కూడా ఆ ఇంట్లో కోడలిని చేద్దామని అనుకున్నావ్ అంట కదా.. అందరిముందు ఆ విషయం తెలిసి గొడవ అయిందట కదా అని ఆవిడా అనగానే.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బాధగా అక్కడ నుండి వెళ్ళిపోతారు. అక్కడే ఉన్న అన్నపూర్ణ ఆవిడని తిట్టి పంపిస్తుంది. అదే సమయంలో ఆవిడ అన్న మాటలన్నీ అప్పు విని బాధపడుతుంది. మరొకవైపు కావ్య గదిలోకి వచ్చేసరికి రాజ్ పడుకుంటాడు. ఇంత త్వరగా పడుకున్నాడు ఏంటని కావ్య అనుకుంటుంది. ఆ తర్వాత భోజనం తీసుకొని అన్నపూర్ణ అప్పు దగ్గరికి వెళ్తుంది. ఇందాక వచ్చిన ఆవిడా ఎందుకు అలా మాట్లాడుతుందంటు అప్పు బాధపడుతుంది. రాజ్ ఫోన్ అలారం అవుతుంది. దాంతో రాజ్, కావ్య ఇద్దరు నిద్ర లేస్తారు. రాజ్ ఆఫీస్ కీ రెడీ అవుతాడు. ఎందుకు ఇంత రాత్రి అని కావ్య అడుగుతుంది. డిజైన్స్ రేపే వాళ్లకి ఇవ్వాలి. ఇప్పుడు నేను వెళ్లి ఫైనల్ చెయ్యాలి టీం అందరు ఆఫీస్ కీ వస్తున్నారని రాజ్ రెడీ అయి వెళ్తాడు.

ఆ తర్వాత శ్వేతా పడుకొని ఉండగా వాళ్ళ ఇంట్లోకి ఒక వ్యక్తి వెళ్తాడు. ఏదో సౌండ్ వచ్చిందని శ్వేత రూమ్ లో నుండి బయటకు వస్తుంది. శ్వేతకి అతను కన్పించడు. ఎవరు లేరని శ్వేత లోపలికి వెళ్తుంది. అప్పుడే శ్వేతకి రాజ్ ఫోన్ చేసి మాట్లాడుతాడు. నాకు భయంగా ఉంది.‌ ఇంట్లో ఎవరో ఉన్నారనిపిస్తుందని రాజ్ తో శ్వేత అనగానే.. మరి నేను రావాలా అని రాజ్ అంటాడు. వద్దని శ్వేత అంటుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసాక మళ్ళీ ఎవరో ఉన్నట్లు అనిపించి.. శ్వేత భయపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాలిసిందే.


Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.