English | Telugu

Jayam serial: సన్మానంలో గంగ, రుద్రలకి అవమానం.. పారు ప్లాన్ హిట్!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -183 లో... గంగ, రుద్ర మాఫియా గ్యాంగ్ నుండి కొంతమంది అమ్మాయిలను సేవ్ చెయ్యడంతో వారిద్దరికి సన్మానం ప్లాన్ చేస్తారు. సన్మానానికి పెద్ద సారు కుటుంబంతో వస్తాడు.

అక్కడ గంగ గురించి ఒకతను గొప్పగా చెప్తాడు. తను ఒక పేపర్ చూస్తూ చెప్తాడు. అందులో పారు ప్లాన్ చేసినట్టుగా గంగ గురించి తక్కువ చేసి మాట్లాడినట్లు ఉంటుంది. గంగ వాళ్ళ నాన్న తాగుబోతు.. వాళ్ళ అమ్మ అనారోగ్యంగా ఉంటుంది. పూట గడవని సిచుయేషన్ గంగ అన్ని పనులు చేసేదని ఉంటుంది.

దాంతో గంగ స్టేజ్ పైకి వెళ్లి ఇప్పటివరకు అందరు చెప్పింది నిజమే.. నేను నా కుటుంబం గడవడం కోసం చాలా కష్టపడ్డాను కానీ అన్యాయం చెయ్యలేదు.. మా అమ్మ విలువలతో నన్ను పెంచింది.. నేను చేసిన పనికి నామోషీగా ఫిల్ అవ్వనని గర్వంగా చెప్పుకుంటానని గంగ అంటుంది. ఇది అవమానం అయినా ప్రశంసగా మార్చుకుందని ఇషిక, పారు అనుకుంటారు.

ఆ తర్వాత గంగ, వీరుకి సంబంధించిన ఒక వీడియో ప్లాన్ చేసామని అక్కడున్న వాళ్ళు అంటారు. అందులో మొదట్లో ఇద్దరి గురించి గొప్పగా ఉంటుంది. కానీ చివరికి వచ్చేసరికి గంగ అకాడమీలో డ్యాన్స్ చేసినట్లు ఉంటుంది. రుద్ర అరెస్ట్ అయింది ఉంటుంది. అది చూసి ఇలా పిలిచి మరీ అవమానిస్తారా అని సూర్య అక్కడున్న వాళ్లపై కోప్పడతాడు. సూర్య నువ్వు కూల్ అని రుద్ర అంటాడు.

రుద్ర స్టేజ్ పైకి వెళ్లి తనని పోలీసులు అరెస్ట్ చేసిన దాని గురించి క్లారిటీ ఇస్తాడు. ఈ సన్మానం మా పెద్దమ్మ పెద్దనాన్న చేతులు మీదుగా జరగాలని రుద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.