English | Telugu

మేం ఆర్టిస్టులం కాకపోయి ఉంటే ఆ ఫీల్డ్స్ లో ఉండేవాళ్ళం...

జానకి కలగనలేదు సీరియల్ సెట్ లో యూట్యూబర్ లోల నరేష్ ఒక వెరైటీ కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేసాడు. "ఒకవేళ ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే ఏం అయ్యేవారు ? " అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఆర్టిస్టులను ఫాలో అయ్యే ఫాన్స్ లో, ఆడియన్స్ లో ఆ డౌట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంగా ఈ సీరియల్ ఆర్టిస్టులు ఒక్కొక్కరు ఒక్కోటి చెప్పారు. " నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటే లాయర్ అయ్యి చెట్టు కింద ప్లీడర్ లా కూర్చుని అన్ని కేసులు వాదించేవాడిని..మొదట్లో టిప్పర్ లారీ డ్రైవర్ అవ్వాలని ఉండేది ఎందుకంటే డ్రైవింగ్ అంటే ఇష్టం కాబట్టి.. " అని చెప్పాడు అమరదీప్. "నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటే సినిమాటోగ్రాఫర్ ని అయ్యేవాడిని" అని చెప్పాడు మరో ఆర్టిస్ట్ అఖిల్.

"నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటే టెర్రరిస్టు అయ్యేది" అంటూ నటి భవిష్య చేత చెప్పించారు మిగతా సీరియల్ యాక్టర్స్. ఐతే తనకు మాత్రం ఛార్టర్డ్ అకౌంటెంట్ అవ్వాలని ఉండేదని చెప్పింది. "నేను ఆర్టిస్ట్ ను కాకపోయి ఉంటే ఎయిర్ హోస్టెస్ కానీ డాక్టర్ కానీ పోలీస్ కానీ అయ్యుండేదాన్ని" అని చెప్పింది సీరియల్ హీరోయిన్ అమ్ములు అలియాస్ ప్రియాంక జైన్. ఇక లోలా నరేష్ ని కూడా ఇదే ప్రశ్న అడిగింది ప్రియాంక " ఆర్టిస్ట్ కాకపోయి ఉంటే వెటర్నరీ డాక్టర్ అయ్యేవాడిని ఎందుకంటే నాకు పశువులు అంటే ఇష్టం" అని చెప్పాడు. ఇలా ఈ సీరియల్ యాక్టర్స్ అంతా ఏం అవ్వాలనుకుని ఏం అయ్యారో చెప్పారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.