English | Telugu

నన్ను పెళ్లి చేసుకుంటావా?.. ప‌విత్ర‌కు ప్ర‌పోజ్ చేసిన సంతోష్‌!

'శ్రీదేవి డ్రామా కంపెనీ' ఈ వారం సోసోగా సాగింది. ఐతే ఇందులో ఫైనల్ ట్విస్ట్ గా కొన్ని సర్ప్రైజ్ లు ప్లాన్ చేశారు. ఆది తను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక అమ్మాయికి రాసిన లవ్ లెటర్ ని ఫన్నీగా చదివి వినిపించాడు. ఇమ్మానుయేల్ తను 8th క్లాస్ చదివేటప్పుడు తన ఫస్ట్ లవ్ కొనిపెట్టిన జామెట్రీ బాక్స్ ని చూపించి దాని హిస్టరీ చెప్పుకొచ్చాడు. ఇక పంచ్ ప్రసాద్ తన ఫస్ట్ లవ్ ఐన సునీతకు కొనిచ్చిన రింగ్ ని చూపించాడు. నిజ జీవితంలో సునీతనే పెళ్లి చేసుకున్నాడు ప్రసాద్.

ఇక ఈ జోడి పెయిర్ లో పరదేశి జోడి కొత్తగా ఎంట్రీ ఇచ్చింది. ఐశ్వర్యను స్టేజి మీదకు తీసుకొచ్చి ప్రపోజ్ చేసాడు ప‌ర‌దేశి. అలాగే తన గుండెల మీద పొడిపించుకున్న ఆమె పచ్చబొట్టు పేరు చూపించి తన ప్రేమను యాక్సెప్ట్‌ చేయమంటూ అడిగేసరికి ఐశ్వర్య కూడా షాక్ అయ్యింది.

అలాగే పవిత్రకి కూడా యాంకర్ రష్మీ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. సంతోష్ అనే వ్యక్తిని స్టేజి మీదకు పిలిచారు. అతను వచ్చి తన ప్రేమనంతా గొప్ప కవిత్వంగా మార్చేసి చెప్పేసి పవిత్ర ఫోటోతో ఒక లామినేషన్ చేసి ఇచ్చేసాడు. "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అని రింగ్ ఇచ్చి మరీ అడిగేసరికి పవిత్ర షాకైపోయింది.

"అసలు అతనెవరో నాకు తెలియాలి. నన్నెప్పటినుంచి ప్రేమిస్తున్నావ్? అసలు నేనంటే నీకు ఎందుకంత ఇష్టం" అంటూ ప్రశ్నించే సరికి స్టేజి మీద అందరూ స్ట‌న్న‌య్యారు. "నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేయాలనుకున్నాం, చేసాం" అని రష్మీ చెప్పేసరికి అదంతా నిజమో, అబ‌ద్ధ‌మో అర్థం కాక ఆడియన్స్ తలలు పట్టుకున్నారు.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.