English | Telugu

Guppedantha Manasu : అతని చెంపచెల్లుమనిపించింది.. అసలు రిషి ఏమైనట్టు?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -994 లో.... అనుపమ, ముకుల్ లు ఇద్దరు మాట్లాడుకుంటారు. అసలు రిషికి అలా జరగడం ఏంటని ఆలోచిస్తారు. నిజంగానే రిషి చనిపోయాడా అని ముకుల్ ని అనుపమ అడుగుతుంది. అవునని ముకుల్ అనగానే.. ఈ పని కూడా శైలేంద్ర చేసి ఉంటాడు. ఎవరిలా చేసింది.. తెలిసిందా అని అనుపమ అడుగుతుంది. భద్ర చేసి ఉంటాడు.. ఎందుకంటే వసుధార ఆ భద్రని పట్టించినప్పుడు వార్నింగ్ ఇచ్చాడు. మళ్ళీ తప్పించుకుని వసుధారపై కోపంతో ఇలా చేసాడేమోనని ముకుల్ అంటాడు.

ఆ తర్వాత వసుధారని ఆ పరిస్థితిలో చూడలేకపోతున్నానని అనుపమ అంటుంది. ఇప్పుడు మీరు వసుధార దగ్గర ఉండాలని అనపమతో ముకుల్ చెప్తాడు. ఆ తర్వాత శైలేంద్ర, దేవయాని ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. ఇక ఎండీ చైర్ నాదే.. ఆపేవారే లేరంటూ శైలేంద్ర సంబరపడుతుంటాడు.. ఆ జగతి ఎన్నెన్ని మాటలు అంది. ఎప్పుడు నీ కొడుకు ఎండీ కాలేడు.. ఆ అర్హత కేవలం నా కొడుకుకి మాత్రమే ఉందని చివరికి దానికోసం చచ్చిపోయింది. ఆ తర్వాత ప్రతీసారి ఆ వసుధర అడ్డుపడేదని దేవయాని అంటుంది. ఇక ఎవరు నన్ను ఆపేవారే లేరని శైలేంద్ర అంటాడు. మన ఇన్వాల్వ్ మెంట్ లేకుండా చాలా జరుగుతున్నాయని శైలేంద్ర అంటాడు. కానీ మీ డాడ్.. రిషి అలా చనిపోయాడని మంచాన పడ్డాడని దేవయాని అంటుంది. అది కూడా ఇప్పుడు మన మంచికే. డాడ్ కాలేజీకీ వస్తే అదేంటీ ఇదేంటని అడుగుతాడు. నేను ఎండీ అయ్యేవరకు డాడ్ కాలేజీకీ రాకపోవడమే బెస్ట్ అని శైలెంద్ర అంటాడు.

ఆ తర్వాత వసుధార కాలేజీకి వస్తుంటే స్టూడెంట్స్ ఫాకల్టీ సర్ చనిపోయారు కదా మేడమ్ అంటు అడుగుతారు. శైలేంద్ర కూడా ఉంటాడు. ఎవరు మీకు చెప్పింది.. రిషి సర్ బాగున్నారంటు వసుధార వాళ్లకి సమాధానం చెప్తుంది. వసుధార అలా మాట్లాడుతుంటే.. మేడమ్ ఎందుకు ఇలా బెహేవ్ చేస్తున్నారని అనుకుంటారు. ఆ తర్వాత వసుధార క్యాబిన్ లోకి వెళ్లి పేపర్స్ అన్ని పడేస్తుంటుంది. మళ్ళీ శైలేంద్ర వచ్చి ఇకనైనా నాకు ఎండీ సీట్ ఇచ్చి వెళ్ళిపోమని అంటాడు. వసుధారకి కోపం వచ్చేలా మాట్లాడేసరికి శైలేంద్ర చెంప చెల్లుమనిపించి.. ఎండీ సీట్ ని టచ్ కూడా చెయ్యనివ్వనంటు వార్నింగ్ ఇస్తుంది. అవమానంగా ఫీల్ అయి శైలేంద్ర వెళ్ళిపోతాడు. మరొక వైపు రిషి లేడని బాధపడుతు మళ్ళీ మహేంద్ర డ్రింక్ చేయబోతుంటే.. అనుపమ వచ్చి ఆపుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.