English | Telugu

Guppedantha Manasu:భద్ర దాటికి వసుధార వెన్నులో వణుకు.. కొంచెంలో తప్పించుకుందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -967 లో... మహేంద్రకి భద్ర ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. మహేంద్ర చెప్పబోతుంటే వసుధార ఫోన్ లాక్కొని ఫోన్ కట్ చేస్తుంది. రిషి సర్, నేను ఇక్కడ ఉన్నట్లు ఎవరికి తెలియకుడదు మావయ్య. ఇప్పటికి రిషి సర్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలని వసుధార అంటుంది. దానికి మహేంద్ర కూడా సరేనని అంటాడు. అ తర్వాత మళ్ళీ భద్ర కాల్ చేస్తాడు. మహేంద్ర లిఫ్ట్ చేసి అక్కడ ఉన్న విషయం చెప్పకుండా మాట్లాడతాడు.

అ తర్వాత మహేంద్ర వెళ్లిపోతు రిషి దగ్గరకి వచ్చి ఎమోషనల్ అవుతాడు. జాగ్రత్త నేను వెళ్తున్నానని మహేంద్ర చెప్పి వెళ్తాడు. మరుసటి రోజు ఉదయం కాలేజీలో మీటింగ్ ఏర్పాటు చేస్తారు. ఈ వసుధార మేడమ్ అసలు ఎక్కడ ఉన్నారంటు బోర్డు మెంబర్స్ అడుగుతారు. రిషి సర్ జగతి మేడమ్ ఎండీగా ఉన్నప్పుడు కాలేజీ బాగుండేదంటు బోర్డు మెంబర్స్ అంటారు. శైలేంద్రకి ఎండీగా బాధ్యతలు ఇవ్వాలని బోర్డు మెంబర్స్ అనగానే దానికి సంబంధించిన నిర్ణయాలు మొత్తం వసుధార తీసుకుంటుందని ఫణీంద్ర అందరికి చెప్తాడు. వసుధార ఎక్కడ ఉందో ఫోన్ కలవట్లేదు ఇప్పుడు ఒకసారి చేసి చూస్తానని వసుధరాకి ఫణీంద్ర ఫోన్ చెయ్యగానే వసుధార లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. ఎక్కడ ఉన్నావని ఫణింద్ర అడుగుతాడు. మా నాన్నకు బాలేకపోతే మా ఇంటికి వచ్చానని చెప్తుంది. దాంతో శైలెంద్రకి రిషి అక్కడే ఉన్నాడేమోనని డౌట్ వస్తుంది. అప్పుడే భద్రకి శైలేంద్ర ఫోన్ చేసి.. వసుధార వాళ్ళ నాన్న దగ్గర ఉందట. రిషి అక్కడే ఉన్నాడు కావచ్చు. నేను అడ్రస్ పంపిస్తున్నాను వెళ్ళి ఇల్లంతా చూడు రిషి ఉన్నాడేమోనని చెప్తాడు.

కాసేపటికి వసుధార ఉన్న ఇంటికి భద్ర వస్తాడు. భద్రని అక్కడ చూసిన వసుధార షాక్ అవుతుంది. నువ్వు ఎందుకు వచ్చావ్. నేను ఇక్కడ ఉన్నట్లు నీకెలా తెలుసని వసుధార అంటుంది. తెలుసుకున్నాను.. అయిన మీకు నేను సెక్యూరిటీ అని భద్ర చెప్తాడు. అప్పుడే లోపల ఉన్న రిషి దగ్గుతు ఉంటాడు. ఇంకా ఎవరో ఉన్నారని భద్ర అనుమానంగా అడుగుతు లోపలికి వెళ్లిపోతుంటే వసుధార తనపై కోప్పడుతుంది. అప్పుడే చక్రపాణి వస్తాడు. అయిన లోపల ఎవరో ఉన్నారంటు వెళ్ళబోతుంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్లకుంటే మావయ్యకి చెప్పి జాబ్ తీయించేస్తానని వసుధార అనగానే భద్ర వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహేంద్రకి వసుధార ఫోన్ చేసి.. భద్ర ఇక్కడికి వచ్చాడు.. మీరేమైనా అడ్రెస్ చెప్పారా అని వసుధార అడుగగా.. నేను చెప్పలేదు. అయిన ఎందుకు వచ్చాడు. రిషి అక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియదు తెలియొద్దని మహేంద్ర అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.