English | Telugu

Brahmamudi:అత్తలకి వార్నింగ్ ఇచ్చిన పెద్ద కోడలు.. చెల్లికి అక్క సపోర్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -300 లో.. కావ్యని చూసిన కృష్ణమూర్తి.. ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతాడు. నువ్వు అసలు ఇక్కడికి ఇక ఎప్పటికి రాకు అనేసరికి.. కావ్యతో పాటు మిగతావాళ్ళు షాక్ అవుతారు. ఇప్పటికే స్వప్న వల్ల అప్పు వల్ల.. నీ అత్తారింట్లో నీ పరువు పోయి నిన్ను చులకనగా చూస్తున్నారని కృష్ణమూర్తి ఆవేదన గా మాట్లాడుతాడు. ఆ దుగ్గిరాల ఇంటి నుండి ఈ మట్టి బొమ్మలకు రంగులు వేసుకుని నా ఇంటికి రాకని కృష్ణమూర్తి చెప్తాడు.

ఏమైందయ్య నీకు.. కన్నకూతురిని ఎవరైనా అలా అంటారా అని కనకం అంటుంది. నీ వల్లే ఇదంతా భర్త చాటు భార్యలాగా ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండేది.. ఆకాశానికి నిచ్చెన వేసే నీ అలోచనలు ఉండడం వల్లే ఇదంతా అని కృష్ణమూర్తి అంటాడు. నేను వెళ్ళను కానీ కావ్యని రావద్దు అనడం కరెక్ట్ కాదని కనకం అంటుంది. నా పుట్టింటికి నేను ఎప్పుడైనా వస్తాను.. వెళ్తానని కావ్య తెగిసి చెప్పి వెళ్ళిపోతుంది. అలా మాట్లాడినందుకు కృష్ణమూర్తి తను వెళ్తుంటే బాధగా చూస్తాడు. మరొకవైపు అనామిక , కళ్యాణ్ లకి కొత్తగా పెళ్లి అయిందని ఇంట్లో సత్యనారాయణ వ్రతం చెయ్యడానికి దుగ్గిరాల ఇంట్లో ముహూర్తం చూడడానికి పంతులుని పిలిపిస్తారు. పంతులు వెళ్లిపోయాక కావ్య ఇంటికి వస్తుంది. ప్రొద్దున వెళ్ళావ్ ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావని అపర్ణ కోప్పడతుంది. మా పుట్టింటికి వెళ్ళానని కావ్య చెప్పగానే.. ఆ ఇంటితో ఏ సంబంధం పెట్టుకోవద్దని చెప్పాము కాదా అని ధాన్యలక్ష్మి అపర్ణ ఇద్దరు అడుగుతారు. ఇంట్లో పెద్ద వాళ్ళ మాటలు అంటే లెక్క లేదా అని అనామిక అంటుంది. మళ్ళీ ఏం ప్లాన్ చెయ్యడానికి వెళ్ళావని రుద్రాణి అనగానే.. అప్పుడే స్వప్న వచ్చి.. ఎందుకు ఎప్పుడు మా మీద, మా ఫ్యామిలీ మీద పడి ఏడుస్తావని రుద్రాణికి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.

ఆ తర్వాత తప్పు చేసామని అంటున్నారు కాదా కావ్య అనుకుంటే.. నిమిషం పట్టదు కళ్యాణ్, అప్పుల పెళ్లి చేయడానికి కానీ అలా ఏం చెయ్యలేదు మొదటి నుండి అనామిక, కళ్యాణ్ ల లవ్ కి సపోర్ట్ చేస్తూ పెళ్లి వరకు తీసుకొని వచ్చింది. ఎందుకు అలా తప్పు చేస్తుంటు కావ్యకి సపోర్ట్ గా‌ స్వప్న మాట్లాడుతుంది. ఆ తర్వాత స్వప్నని కావ్య పక్కకి తీసుకొని వెళ్లి అలా మాట్లాడకూడదని చెప్తుంది. మరొకవైపు ముగ్గురు అత్తలు అయిన అపర్ణ, ధాన్యలక్ష్మ, రుద్రాణి‌ కలిస కోడళ్ళు గురించి మాట్లాడుకుంటారు. అనామికని ఆ కావ్యకి దూరంగా ఉంచమని రుద్రాణి అనగానే.. నా కోడలు చాలా తెలివైందని ధాన్యలక్ష్మి అంటుంది. ఇలా ముగ్గురు కావ్య గురించి నెగెటివ్ గా మాట్లాడుకుంటారు. కావ్యకి అందరు నెగెటివ్ గా ఉన్నారని రుద్రాణి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తరువాయి భాగంలో కావ్య పూజకి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంటే.. దీపం పెట్టేది రుద్రాణి కిందకి పడేసి కావ్యపై చెప్తుంది. దాంతో అందరు కావ్యని తిడుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.