English | Telugu

Eto Vellipoyindhi Manasu : అగ్నిసాక్షిగా తను నేను తాళి కట్టిన భార్య.. నా కుటుంబం జోలికి రావొద్దు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -196 లో.....మీరు ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారని అర్థమవుతుంది.. ఇదంతా చేసింది మీరే అని నాకు తెలుసని శ్రీలతతో రామలక్ష్మి అంటుంది. నేనే అనడానికి సాక్ష్యం ఏముంది? అనవసరంగా నిందలు వెయ్యకని శ్రీలత అంటుంది. ఆ బ్రేక్ లు తీయడం శ్రీలతకి తెలియకుండా‌ సందీప్ చేసాడు. అయ్యో అత్తయ్యకి విషయం తెలిస్తే ఎలా అంటు శ్రీవల్లి టెన్షన్ పడుతుంది. మరొకవైపు సీతాకంత్ కోపంగా నందిని దగ్గరికి వెళ్తాడు.

అసలు నువ్వు ఎం చేస్తున్నావు.. నీకు అర్ధమవుతుందా.. నీ ప్రేమని దక్కించుకోవడానికి ఏదైనా చేస్తావని తెలుసు.. మరి ఇలా చేస్తావనుకోలేదు.. నీ ప్రేమ కోసం నా భార్య అడ్డు తొలగించాలనుకున్నావంటూ సీతాకాంత్ నందినిపై కోప్పడుతాడు. నువ్వేం అంటున్నావో అర్థం కావడం లేదని నందిని అంటుంది. నోరు ముయ్.. రామలక్ష్మి నేను బయటకు వెళ్తుంటే మీటింగ్ అంటూ నన్ను వద్దని చెప్పి తనని చంపాలని చూసావని సీతాకాంత్ అంటాడు. రామలక్ష్మి అగ్నిసాక్షిగా నేను తాళి కట్టిన భార్య.. తనకి ఏదైనా అయితే నేను తట్టుకోలేను.. ఇప్పుడేం కాలేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను.. నా జోలికి.. నా కుటుంబం జోలికి రాకని నందినికి సీతాకాంత్ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.

మరొకవైపు రామలక్ష్మికి ఆక్సిడెంట్ గురించి శ్రీవల్లి, సందీప్ మాట్లాడుకుంటారు. అప్పుడే శ్రీలత వస్తుంది. ఎందుకు ఇలా చేసావ్ టైమ్ బాలేక దొరికపోతే పరిస్థితి ఏంటని సందీప్ తో శ్రీలత అంటుంది. మరొకవైపు రామలక్ష్మికి డాక్టర్ వచ్చి ట్రీట్ మెంట్ ఇస్తుంది. ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరుండి చూసుకుంటాడు. నా దగ్గర వచ్చి పడుకోమని రామలక్ష్మిని శ్రీలత పిలుస్తుంది.‌ అవసరం లేదు తనని నేనే చూసుకోవాలని సీతాకాంత్ అంటాడు. ఆ తర్వాత ఒకవేళ నువ్వే అలా చేసావా అని నందినిని హారిక అడుగుతుంది. నువ్వు కూడా అలా అంటావేంటని నందిని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.