English | Telugu

షీ ఈజ్ ఏ ట్రూ పాన్ ఇండియా యాక్ట్రెస్!


చెఫ్ మంత్ర సీజన్ 2 ప్రతీ వారం మంచి జోష్ తో సాగిపోతోంది. ఇక ఇప్పుడు ఈ ప్రోగ్రాం లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ప్రగతి 25 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉంది అలాంటి ప్రగతికి జోడి గెస్ట్ గా 25 ఏళ్ళ వయసున్న నిధి అగర్వాల్ ని గెస్ట్ గా తీసుకొచ్చింది మంచు లక్ష్మి. నిధి అగర్వాల్ ని మంచు లక్ష్మి ఈ షో మొత్తం సరదాగా ఆట పట్టించేసింది.

"ఏమిటి తెలుగు నేర్చుకోలేదా ఎక్కడా" అని అడిగేసరికి " నేను తెలుగు నేర్చుకున్నాను నాకు తెలుగు తెలుసు" అని ఆన్సర్ ఇచ్చింది నిధి. తర్వాత "షీ ఈజ్ ఏ ట్రూ పాన్ ఇండియా యాక్ట్రెస్" అని నిధి ప్రగతికి సూపర్ కంప్లిమెంట్ ఇచ్చేసింది. ఇక నిధి, ప్రగతితో చపాతీలు చేయించింది.."చిన్నప్పటి నుంచి నువ్వు యాక్టర్ అవ్వాలనుకున్నావా" అని లక్ష్మి అడిగేసరికి "పుట్టినప్పటినుంచి యాక్టర్ అవ్వాలనుకున్నా" అని ఆన్సర్ చేసింది నిధి.

"నిధి నువ్వు చేసిన మొదటి వంటకం ఏమిటి" అని అడిగింది లక్ష్మి.."చాయ్ చేసాను" అని ఫన్నీగా ఆన్సర్ చేసింది.."పవన్ కళ్యాణ్ గారిని ఏమని పిలుస్తావ్ " అని అడిగేసరికి " సర్" అని పిలుస్తానంటూ జవాబిచ్చింది. ఇలా రాబోయే వారం ఈ ముగ్గురూ మంచి ఎంటర్టైన్మెంట్ అందించనున్నారు.