English | Telugu

భర్త నడుము మీద పుట్టుమచ్చ లేదని కనిపెట్టేసిన భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -377 లో....కావ్య దగ్గరికి ఇందిరాదేవి వస్తుంది. నువ్వు వెళ్లిన పని ఏమైంది.. ఆ బాబు తల్లిని తీసుకొని రావాలని చూస్తున్నవ్ కానీ వస్తే ఇంట్లో నీ పరిస్థితేంటో అర్థం చేసుకున్నావా అని ఇందిరాదేవి అడుగుతుంది. ఆ పరిస్థితి రాదని నా మనసు చెప్తుందని కావ్య అంటుంది. మరొకవైపు కళ్యాణ్ తో‌ నువ్వు ఎందుకు బయటకు వెళ్ళావ్? అలా అని తప్పు పట్టలేను అని అప్పుతో కృష్ణమూర్తి అంటాడు.

ఆ తర్వాత నా కూతురు తప్పు చెయ్యనంత వరకు ఎవరికీ భయపడదు. నీకు నచ్చింది నువ్వు చేసుకొ అమ్మ ఎవరు అడుగుతారో నేను చూస్తానంటూ అప్పుకి కనకం చెప్తుంది. ధాన్యలక్ష్మి అయిన ఆ కుటుంబ అయినా ఏమైనా అంటే వాళ్ళ సంగతి నేను చెప్తానని కనకం అంటుంది. మీరు కంగారుపడకండి నాన్న.. అమ్మ ఏదో చెప్పిందని.. నా ఇష్టానికి ఏదీ చెయ్యను. మిమ్మల్ని బాధపెట్టనని కృష్ణమూర్తితో అప్పు అంటుంది. ఆ తర్వాత బాబుకి కావ్య స్నానం చేయించి బట్టలు వేస్తుంటే.. రుద్రాణి వచ్చి రాజ్ లాగే బాబు కూడా చాలా బాగున్నాడని రాజ్ పోలికలేనని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ నడుమ్ కి ఉన్న పుట్టుమచ్చ రుద్రాణి చూసి.. సేమ్ రాజ్ కి కూడా అలాగే ఉందని రుద్రాణి అంటుంది. నిజంగానే ఈ బాబు ఆయన బాబేనా అని కావ్య ఆలోచనలో పడుతుంది. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కావ్య వచ్చి.. నడుంకి పుట్టుమచ్చ ఉందో లేదో చూడడానికి ట్రై చేస్తుంటే.. ఏం చేస్తున్నావ్ నా నడుం ఎందుకు చూసున్నావంటు రాజ్ అడుగుతాడు. చూస్తే ఏమైందంటూ కావ్య దబాయిస్తుంది.

ఆ తర్వాత అనామిక దగ్గరికి రుద్రాణి వచ్చి.. నువ్వు కోపంగా ఉంటావని తెలుసు కానీ కళ్యాణ్ నీకు నచ్చినట్టు ఉండాలంటే కొంచెం ప్రేమగా ఉండని అనామికకి రుద్రాణి చెప్తుంది. ఆ తర్వాత కళ్యాణ్ గదిలోకి రాగానే అనామిక ప్రేమగా మాట్లాడాలని ట్రై చేస్తుంది కానీ కళ్యాణ్ పట్టించుకోడు. ఆ తర్వాత రాజ్ పడుకున్నాక బొద్దింక దూరిందని కావ్య కవర్ చేస్తూ రాజ్ నడుంకి మచ్చ ఉందో లేదో చూస్తుంది. తీరా చూస్తా రాజ్ కి నడుం దగ్గర పుట్టుమచ్చ ఉండదు. ఆ తర్వాత రాజ్ పడుకుంటూ పుట్టుమచ్చ లేనంత మాత్రాన.. బాబు నా బాబు కాకుండా పోడని రాజ్ అనగానే.. కావ్య ఆశ్చర్యపోతుంది. తరువాయి భాగంలో కళ్యాణ్ కి భాద్యతలు ఇస్తున్నట్లు రాజ్ చెప్పగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.