English | Telugu

Brahmamudi : రాజ్ ని చూసి సీతారామయ్య హ్యాపీ.. వాళ్ళని ఆడుకున్న అప్పు ఫ్రెండ్స్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -715 లో.. అప్పుకి స్వప్న ఫోన్ చేసి మనం చేస్తున్న ఈ ప్లాన్ ని ఫెయిల్ చెయ్యడానికి మా అత్త రాహుల్ వచ్చారని చెప్తుంది. అలా ఎందుకు రానిచ్చావని అప్పు అడుగుతుంది. నేను వచ్చే లోపే వెళ్ళిపోయారని స్వప్న చెప్తుంది. సరే వాళ్ళ సంగతి నేను చెప్తానని అప్పుఅంటుంది. అప్పు మాట్లాడింది మొత్తం రాహుల్, రుద్రాణి వింటారు. ఇది మనల్ని ఎలా గుర్తుపడుతుందని అనుకుంటారు.

ఆ తర్వాత భోజనం చేద్దాం రండీ మావయ్య అని సీతారామయ్యని అపర్ణ పిలుస్తుంది. నేను రానని నిరాశగా చెప్తుంటే ఏమైందని సుభాష్ అడుగుతాడు. రాజ్ బ్రతికి ఉన్నాడని చెప్పారు కానీ ఇంతవరకు వాడిని చూపించలేదని కోప్పడతాడు. దాంతో కావ్యకి అపర్ణ ఫోన్ చేసి మావయ్య వాళ్ళకి వీడియో కాల్ లో చూపించు అనగానే.. సరే కానీ మీరు కన్పించకండి అని అంటుంది‌. మీరు అక్కడ ఉన్నారేంటి అనుకుంటాడని కావ్య అంటుంది. దానికి అపర్ణ సరే అంటుంది. యామినితో రాజ్ మాట్లాడుతుంటే కావ్య పిలుస్తుంది. మా ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను వీడియో కాల్ లో అని కావ్య ఇంట్లో వాళ్లకి ఫోన్ చేస్తుంది. మొదట సీతారామయ్య, ఆ తర్వాత ఒక్కొక్కరిగా రాజ్ తో మాట్లాడతారు.

రాజ్ తో మాట్లాడాక సీతారామయ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొకవైపు రెసాట్ కి వచ్చిన సందీప్ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి రాహుల్, రుద్రాణిలని అది చెయ్ ఇది చెయ్ అని ఒక ఆట ఆడుకుంటారు. అప్పు వచ్చి ఇక చాలు అని సందీప్ ఫ్రెండ్స్ కి చెప్తుంది. తరువాయి భాగంలో కళ్యాణ్, అప్పు ఇద్దరు కలిసి రాజ్ కి గతం గుర్తుకొచ్చేలా మాట్లాడతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.