English | Telugu

ఇద్దరి ఆడవాళ్ళ మధ్య బిందెల ఫైట్...

సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ సీరియల్ కి ఇద్దరు ఘనాపాఠీలు ఎంట్రీ ఇచ్చారు. అది కూడా స్టేజి దగ్గరకు కార్ లో వచ్చి డోర్ తీసుకుని అలా స్టేజి మీదకు నడిచొచ్చారు. "ఎండా కాలంలో ఏదైనా మంచు ప్రదేశానికి వెళదాం అనుకున్నా ఇక్కడికి వచ్చేసారు" అంటూ మంచు లక్ష్మిని చూపించింది రోజా. "పోటీలో ఎవరైనా కంచుగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను..మీరు కలిశారు" అని మంచు లక్ష్మి రోజా మీద సెటైర్ వేసింది. తర్వాత ఇద్దరూ షాక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. తర్వాత ఇద్దరితో రవి కొంచెం టఫ్ గేమ్స్ ఆడించాడు. స్టేజి మీద బోరింగ్ పంప్ పెట్టించి నీళ్లు కొట్టించాడు ఇద్దరి చేతా. "నాకు మంచు లక్ష్మికి పోటీ పెట్టారు.

మరి మంచు లక్ష్మి కోసం రవి వెళ్లి నీళ్లు కొడితే ఏంటి అర్ధం" అని అడిగింది రోజా. "ఒకసారి చూడండి నా బిందెలో నీళ్ళే ఎక్కువగా ఉన్నాయి" అంది మంచు లక్ష్మి. "రవి ఇప్పుడు హ్యాపీనా..ఇద్దరి ఆడవాళ్ళ మధ్య బిందెల ఫైట్ పెట్టావ్ గా" అంటూ సెటైర్ వేసింది అష్షు. ఇక బుల్లితెర మీద మంచు లక్ష్మి ఈ మధ్య కాలంలో కనిపించడమే మానేసింది. కానీ ఈ షోకి ఆమె రావడం అదనపు ఆకర్షణే అని చెప్పొచ్చు. ఇక ఈ సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ లో 16 జంటలు పోటీ పడ్డాయి. ఇప్పుడు గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది. నెమ్మదిగా షోస్ అన్నీ కూడా పూర్తైపోవచ్చాయి...చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే ఐపోయింది. డాన్స్ ఐకాన్ సీజన్ 2 కూడా పూర్తి కావొచ్చింది. ఇప్పుడు సూపర్ సీరియల్ కూడా గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది అంటే దాదాపు పూర్తైపోతున్నట్టే. ఇలా కొన్ని షోస్ ఇప్పుడు ఎడ్జ్ కి వచ్చేసాయి. ఈ షో గ్రాండ్ ఫైనల్ కోసం మంచు లక్ష్మిని, రోజాని గెస్టులుగా ఇన్వైట్ చేశారు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.