English | Telugu

'బిగ్ బాస్' ఆరోహి కన్నీటి గతం.. రెమ్యూనరేషన్ కూడా తక్కువేనట!

బిగ్ బాస్ హౌస్ లో ప్రతి సీజన్లో మీడియా నుండి ఒక కంటెస్టెంట్ ని తీసుకోవడం అనేది అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ సారి ఒక ప్రముఖ ఛానెల్ లో ఇస్మార్ట్ న్యూస్ యాంకర్ గా చేస్తొన్న ఆరోహి రావ్ హౌస్ లోకి అడుపెట్టింది.

ఆరోహి రావ్ అసలు పేరు అంజలి. ఈమె వరంగల్ లో జన్మించింది. ఈమె చిన్నప్పుడే తల్లి చనిపోతే, తండ్రి వేరే పెళ్లి చేసుకొని, పిల్లలని వదిలి వెళ్లి పోయాడు. తనకి ఒక సోదరుడు ఉన్నాడు. వీళ్ళిద్దరూ అమ్మమ్మ ఇంట్లో పెరిగారు. ఒకానొక టైంలో వీళ్ళకి సరిగ్గా తినడానికి కూడా తిండి దొరికేది కాదట. ఆరోహి గవర్నమెంట్ స్కూల్ లో చదివింది. ఒక ప్రైవేట్‌ కాలేజీలో M.B.A పూర్తి చేసింది. అయితే తనకు చిన్నప్పటి నుండి యాంకరింగ్ అంటే ఆసక్తి ఉండేదంట. ఆ తర్వాత హైదరాబాద్ కి వచ్చి యాంకర్ గా ప్రయత్నం మొదలు పెట్టింది. ఒక హాస్టల్ లో ఉండేది. తను ఎప్పుడు కష్టాలను ఇంటిపేరుగా, కన్నీళ్లను ముద్దుపేరుగా చెప్పుకుంటూ ఉండేది. తనకు తన చుట్టు ఉన్న వాళ్ళలో 'మేము ఉన్నాం అనే వాళ్ళ కంటే, మాకేంటి అనే వాళ్ళే ఎక్కువ' అని ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.

కొన్ని రోజులకి ఒక చిన్న ఛానెల్ లో అవకాశం రాగా, డబ్బులు సరిపోక కొన్ని రోజులకి అందులో నుండి బయటకి వచ్చేసి, మళ్ళీ అనేక ప్రయత్నాలు చేసింది. అయితే లాక్ డౌన్ సమయంలో ఒక ప్రముఖ ఛానెల్ లో ఇస్మార్ట్ న్యూస్ అడిషన్స్ కి వెళ్లగా, అక్కడ ఆరోహి చలాకీతనం, తెలంగాణ యాసలో మాట్లాడం చూసి సెలక్ట్ చేసారట. ఇస్మార్ట్ న్యూస్ లో ఆరోహి సెటైర్ లు, ఇంకా యాస జనాలకు నచ్చడంతో ఆరోహి పాపులర్ అయింది. బిగ్ బాస్ హౌస్ లోకి పంతొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆరోహి, హౌస్ లో మొదటి వారం నుండి అన్నింటిలోను చురుకుగా పాల్గొంది. అయితే హౌస్ లో స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ లిస్ట్ లో, గీతు తరువాత ఆరోహి అనే చెప్పేస్తారు ఈ షో చూసే ప్రేక్షకులు. కాగా హౌస్ లో అందరితో గొడవలు పెట్టుకోవడం ఒకటి తనకి మైనస్ అని చెప్పుకోవాలి. నామినేషన్ లో నుండి చాలా సార్లు సేవ్ అయినా, కానీ అయిదవ వారం ఓటింగ్ లో చివరి స్థానం ఉండడంతో బయటకొచ్చేసింది. తను బయటికి రావడానికి ఒక రకంగా సూర్య అనే చెప్పుకోవాలి. హౌస్ లో జరిగే అటలో పర్ఫామెన్స్ ఏమీ ఇవ్వకపోగా, సూర్యతో చీటికి మాటికి గొడవ పెట్టుకోవడం ప్రేక్షకులకు చికాకు తెప్పించింది అని అనడంలో ఆశ్చర్యం లేదు. వీరిద్దరిని చూసి హౌస్ లో లవర్స్ అని చాలా మందే అన్నారు. నాగార్జున ఒక సారి అడుగగా మేము మంచి స్నేహితులం అంటూ చెప్పుకొచ్చింది. తను బయటకొచ్చాక హౌస్ లో ఉన్నవాళ్ళ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. "టాప్-5 లో ఉంటా అనుకున్నా, కానీ అయిదవ వారమే బయటికి రావడం చాలా బాధగా ఉంది" అంటు చెప్పుకొచ్చింది.

ఒక ఇంటర్వ్యూలో తన రెమ్యూనరేషన్ గురించి మీరు రోజుకి నలభై వేల వరకు తీసుకున్నారంట కదా అని అడుగగా, "అలాంటిదేమీ లేదు. నేను అంత ఏమీ తీసుకోలేదు" అని మాట దాటేసింది. అయితే తను రోజుకి పదిహేను నుండి ఇరవై వేల వరకు తీసుకుందని బయట వినిపిస్తోంది.

Jayam serial : గంగ, రుద్ర పూజలో కూర్చుంటారా.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -164 లో..... రుద్ర ఏ విధంగా గంగకి హెల్ప్ చేసాడో అందరికి చెప్తాడు. పాపం పెద్దమ్మ హర్ట్ అయినట్లు ఉందని వంశీ అనగానే అయితే అవనివ్వులే గంగ సేఫ్ అయిందని పెద్దసారు అంటాడు. మరొకవైపు పారు ఫ్రెండ్స్ ని అకాడమీ మేడమ్ సస్పెండ్ చేస్తుంది. దాంతో నువ్వు సస్పెండ్ ఆపకపోతే నువ్వే ఇదంతా చేసావని మేడమ్ కి చెప్తానని పారు ఫ్రెండ్ పారుతో అంటుంది. దాంతో మేడమ్ ని సస్పెండ్ క్యాన్సిల్ చెయ్యమని రిక్వెస్ట్ చేస్తుంది పారు. తప్పు ఒప్పుకుంటున్నారు కదా ఈ ఒక్కసారి క్షమించండి అని మేడమ్ తో గంగ అనగానే తను సరే అని సస్పెన్షన్ క్యాన్సిల్ చేస్తుంది.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.