English | Telugu

కంటెస్టెంట్స్ కి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున!

బిగ్ బాస్ హౌస్ లో నిన్న మొన్నటిదాకా జరిగిన బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో రోహిత్ ఏడ్చాడు. అది ఎవరు పట్టించుకోకుండా, ఎవరికి వాళ్ళు తమ‌ సొంత ప్రయోజనం చూసుకోవడంతో కంటెస్టెంట్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.

అయితే మొన్న జరిగిన టాస్క్ లో బ్యాటరీ మొత్తం జీరో అయింది. అప్పుడు " మీలో ఒకరు రానున్న రెండు వారాలు వరుసగా నామినేషన్లో ఉండటానికి సిద్ధపడితే బ్యాటరీ మళ్ళీ ఫుల్ ఛార్జ్ అవుతుంది" అని బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి వివరించాడు. కాగా ఈ త్యాగానికి రోహిత్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత మిగిలిన హౌస్ మేట్స్ తమ అవకాశాలను వినియోగించుకోగా, ఒక్కరు కూడా రోహిత్ ని మీ వల్లే మాకు అవకాశం వచ్చింది మొదట మీరు తీసుకోండి ఛాన్స్ అని ఎవరు అనకపోవడంతో, నాగార్జున గట్టిగా అడిగాడు. దీంతో తప్పు చేసినట్టు అందరు తలదించుకొన్నారు.

ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ, మీరెవరూ రోహిత్ త్యాగాన్ని గుర్తించనందుకు మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఎవరు తీసుకుంటారో చెప్పండని అనగా వసంతి నేను తీసుకుంటానని ఒప్పుకుంది. తర్వాత పనిష్మెంట్ కోసం కన్ఫెషన్ రూంలోకి వెళ్ళిన‌ వసంతికి బిగ్ బాస్ "Cut your Hair Up to shoulder " అని చెప్పగా అలాగే అని ఒప్పుకొంది. ఈ పనిష్మెంట్ మీ అందరికీ, ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి అని నాగార్జున చెప్పుకొచ్చాడు.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.