English | Telugu

Brahmamudi : ఛారిటబుల్ ట్రస్ట్ పెట్టాలనుకున్న కావ్య.. రుద్రాణి రిక్వెస్ట్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -953 లో..... రాజ్ తన బిడ్డ దగ్గరికి వచ్చి ఎత్తుకొని ముద్దాడుతాడు. నిన్ను మీ అమ్మ గుర్తుంచింది కానీ నేను గుర్తించలేదు. ఇప్పటికైనా మీ అమ్మ మాట నమ్మాను లేదంటే జీవితాంతం పశ్చాతాపంతో ఉండేవాడిని అని రాజ్ గిల్టీగా ఫీల్ అవుతాడు. అప్పుడే కావ్య వచ్చి ఏంటి అండి ఇది.. మీరు నన్ను నమ్మారు కాబట్టి ఇదంతా జరిగిందని కావ్య అంటుంది.

మరొకవైపు అప్పు దగ్గరికి కళ్యాణ్ వస్తాడు. ఏమైంది అలా ఉన్నావని అడుగుతాడు. కావ్య అక్క పాప గురించి.. హాస్పిటల్ లో అదే రోజు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు కానీ కావ్య అక్క పాపనే ఎందుకు మార్చారు ఇందులో ఏదో కుట్ర ఉంది కావాలనే మినిస్టర్ కి సలహా ఇచ్చి మార్చేశారు.. దీని వెనకాల ఎవరు వున్నారో కనుక్కోవాలని అప్పు రిక్వెస్ట్ చేయ్యగానే కళ్యాణ్ సరే అంటాడు. దీని వెనకాల మినిస్టర్ ఉన్నాడని తెలిసాక ఈ విషయం వదిలెయ్యాలని కళ్యాణ్ అనగానే అప్పు సరే అంటుంది. మరొకవైపు రాజ్, కావ్య పాపని రెడీ చేస్తారు. అప్పుడే పనిమనిషి శాంత ఏడుస్తూ ఉంటుంది. తన దగ్గరికి కావ్య వచ్చి ఏమైందని అడుగుతుంది. నా కూతురికి బాలేదు ఆపరేషన్ చెయ్యాలన్నారు డబ్బు లేదని ఏడుస్తుంది శాంత. నువ్వు ఏడవకు మేం చూసుకుంటామని కావ్య చెప్తుంది. శాంత వెళ్ళిపోయాక కావ్య ఆలోచనలో పడుతుంది. ఏమైందని రాజ్ అడుగుతాడు. శాంతకి మనం హెల్ప్ చేస్తాం.. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు కదా.. మనం మన ఫ్యామిలీ తరుపున ఛారిటబుల్ ట్రస్ట్ మొదలు పెడుదామని కావ్య అనగానే మంచి ఆలోచన ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్దామని రాజ్ అంటాడు.

మరొకవైపు మినిస్టర్ దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. ఎందుకు వచ్చావని మినిస్టర్ కోప్పడతాడు. నేను చేసింది తప్పే దానివల్ల నా పిల్లలు నన్ను ఛీ కొడుతున్నారు.. నేను రాజ్ మేనత్తని.. నన్ను ఇంట్లో నుండి గెంటేసారని కోపంతో ఇలా చేసాను కానీ ఈ విషయం వాళ్ళకి చెప్పాకండి అని రుద్రాణి రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాష్టర్ కి చాలా కనెక్షన్స్ ఉన్నాయి..లండన్ లో అనుదీప్ సీక్రెట్...స్ట్రాటజీ ప్లే చేయొద్దు

ఈ వారం బీబి జోడి సీజన్ 2లో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో కనెక్షన్ రౌండ్ ని నిర్ణయించారు. జడ్జెస్ అంతా ఫుల్ కాలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "ఫ్రెండ్స్ ఫ్యామిలీ కాకుండా దేనితో మీరు ఎక్కువ కనెక్ట్ అవుతారు" అంటూ ప్రదీప్ శ్రీదేవిని అడిగాడు. "అంటే అలా సడన్ గా అడిగితే ఏది కనెక్ట్ అవ్వట్లేదు" అనేసింది దాంతో ప్రదీప్ సరే  "కొంచెం మెల్లగా అడుగుతా" అంటూ జోక్ వేసాడు. శ్రీదేవి నవ్వేసింది. " మాస్టర్ జీ" అంటూ శేఖర్ మాష్టర్ ని అడిగేసరికి ఆయన నీళ్లు నములుతూ ఉన్నాడు.

Jayam serial : రుద్రకి శకుంతల దగ్గరవుతుందా.. పోటీకి గంగ వెళ్తుందా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -190 లో... భాను పుట్టినరోజు అని గుడిలో అన్నధానం ఏర్పాట్లు చేసానని శకుంతలతో వీరు అంటాడు. భాను గురించి నువ్వు తప్ప ఎవరు ఆలోచించడం లేదని శకుంతల అంటుంది. హాల్లోకి శకుంతల రాగానే భాను ఫోటోని పెడుతూ గంగ కన్పిస్తుంది. అది చూసి భాను ఫోటోని బయటకు ఎందుకు తీసుకొని వచ్చావని కోప్పడుతుంది. నేను ఒక పని కోసం తీసుకొని వచ్చానని గంగ అంటుంది. కిచెన్ నుండి పాయసం తీసుకొని వచ్చి ప్రమీలకి ఇచ్చి భాను ఫోటో దగ్గర పెట్టమని చెప్తుంది. దాంతో ప్రమీల పాయసం పెడుతుంది.

Podharillu : నారాయణ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన మేనత్త.. మాధవ ఏం చేయనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు (Podharillu)'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-47 లో..  కన్నాని కాలేజీకి తీసుకెళ్తుంటాడు మాధవ. అన్నయ్య ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. చక్రి అన్నయ్య రిసెప్షన్ ని గ్రాంఢ్ గా చేసాం.. ఇన్ని రోజులు మనల్ని అందరు అవమానించారు.. ఎన్నో కష్టాలు పడ్డామని మాధవతో కన్నా అనగానే మాధవ ఏం మాట్లాడలేకపోతాడు. చక్రి అన్నయ్య పెళ్ళి జరిగిపోయింది.. ఆ తర్వాత నీ పెళ్ళి తర్వాత కేశవ అన్న పెళ్ళి..  ఆ తర్వాత నా పెళ్ళి అని కన్నా సిగ్గుపడుతుంటాడు. రేయ్.. ఇప్పుడే ఎందుకు నీకు అవన్నీ వెళ్ళి మంచిగా చదువుకొని ఉద్యోగం చేయమని మాధవ అనగానే సరే అని కన్నా కాలేజీకి వెళ్ళిపోతాడు.