English | Telugu

మూగజీవాలకు ఒక గుడ్ న్యూస్ చెప్పిన రష్మీ!


యాంకర్ గా రష్మీ ఇప్పుడు బుల్లితెర మీద ఒక స్టార్. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చేస్తూ వారంలో మూడు రోజుల పాటు ఆడియన్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. మంచి సినిమా ఆఫర్స్ వస్తే అందులో కూడా తన టాలెంట్ చూపిస్తూ ఫుల్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ అన్న తేడా లేకుండా అవకాశాలను వినియోగించుకుంటోంది.

ఎంతో హ్యాపీ గా ఉండే రష్మీ తన మనసులో మూగ జీవాలంటే ఆవేదనతో ఉంటూనే ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో తన ఫొటోస్ కన్నా ఇలా మూగజీవాలు పడుతున్న బాధల్ని ఎక్కువగా పోస్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ని కూడా షేర్ చేసింది. అది ఏంటంటే ఆకాశ ఎయిర్ లైన్స్ వాళ్ళు ప్యాసెంజర్స్ తో పాటు వాళ్ళ పెట్స్ కి కూడా త్వరలోనే అనుమతి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. బుకింగ్స్ అక్టోబర్ 15 నుంచి మొదలు కాబోతున్నాయి. ఎప్పటికీ ఇదొక గుడ్ న్యూస్ అంటూ తన ఇన్స్టా స్టేటస్ లో పోస్ట్ చేసింది. రష్మీ యానిమల్ లవర్. వాటికి హాని జరిగితే ఆమె మనసు భరించలేదు.

మూగజీవాల పట్ల అమానుషంగా ప్రవర్తించే వారిపై చర్యలు తీసుకునేలా కూడా సంబంధిత అధికారులకు ఆమె ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటుంది. రీసెంట్ ఆమె ఒక పోస్ట్ పెట్టింది. ''జంతువులకు సాయం చేసే పరిస్థితి అందరికీ ఉండదు. కానీ వాటికి హాని చేయకూడదని అనే విషయం కూడా అందరికీ తెలుసు" అని చెప్పింది. వాటికి హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ వాటిని హింసించే రైట్ ఎవరికీ లేదు అంటూ ఘాటుగా తిట్టింది ఈ పోస్ట్ ద్వారా.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.