English | Telugu

ఇమ్ము హెయిర్ స్టైల్ నచ్చి టాటూ వేయించుకున్న ఆనంద్ దేవరకొండ

సుమ అడ్డా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి "గంగం గణేశా " మూవీ టీమ్ నుంచి ఆనంద్ దేవరకొండ, ఇమ్మానుయేల్, యావర్, నయన్ సారిక వచ్చారు. రావడంతోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఆనంద్ దేవరకొండను తన బెస్ట్ ఫ్రెండ్ గా పరిచయం చేసాడు ఇమ్ము. ఇలాంటి ఫ్రెండ్ ఎలా దొరికాడంటూ సుమ సెటైర్స్ వేసింది..తన పేరును మెడ మీద టాటూగా వేయించుకున్నాడంటూ ఆనంద్ మెడ మీద టాటూని చూపించాడు ఇమ్ము. దాన్ని చూసి సుమ షాక్ అయ్యింది. "ఆనంద్ ఇమ్ములో ఎం చూశాడని టాటూ వేయించుకున్నాడు" అని అడిగింది సుమ. తనకు ఇమ్ము హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు ఆనంద్.

ఇక హీరో హీరోయిన్స్ మధ్యకు వచ్చి టీ అమ్ముతూ ఉండగా ...అల్లం చాయ్ కావాలని హీరోయిన్ నయన్ సారిక అడిగింది. "అల్లం బెల్లం నువ్వు నా పెళ్ళాం" అని చెప్పి షాక్ ఇచ్చాడు ఇమ్ము. తర్వాత ఆనంద్ దేవరకొండ, ఇమ్ము, యావర్ కలిసి బేబీ 2 పెర్ఫార్మెన్స్ చేసి చూపించారు. ఇమ్ము బేబీగా చేసాడు..తనకు పెళ్ళైనా కూడా విరాజ్, ఆనంద్ కావాలనిపిస్తోంది సుమని అడిగేసరికి షాక్ అయ్యింది. ఆ తర్వాత యావర్, ఇమ్ము ఇద్దరూ కలిసి ఒక రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ కి మంచి స్టెప్స్ వేసి ఎంటర్టైన్ చేసారు. మే 31 న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ‘బేబీ’ లో ఎమోషన్ బాగా పండించిన ఆనంద్ దేవరకొండకు ఈ క్రైమ్ కామెడీ జోనర్ కలిసొస్తుందా లేదా చూడాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.