English | Telugu

'చందమామ' సినిమా నుంచి 'అడివి శేష్'ని తీసేశారు

చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోగా ఎదిగిన అడివి శేష్.. 'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్న ఈ టాలెంటెడ్ హీరో.. జూన్ 3న 'మేజర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఆలీతో సరదాగా షోలో పాల్గొన్న శేష్.. తన కెరీర్ కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

ఆలీతో సరదాగా షోలో శేష్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. అందులో తనని ఓ సూపర్ హిట్ మూవీ నుంచి తీసేశారని షాకింగ్ విషయాన్ని రివీల్ చేశాడు. 2000 నుంచే సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టిన శేష్.. 2002 లో విడుదలైన 'సొంతం' సినిమాలో మెరిశాడు. నిజానికి ఆ సినిమాలో చాలా పెద్ద రోల్ అని చెప్పారట. కానీ తీరా తెరమీద చూస్తే కొన్ని సెకన్ల పాటు మాత్రమే కనిపించానని అప్పటి సంఘటనని గుర్తుచేసుకున్నాడు శేష్.

అలాగే 2007 లో విడులై సూపర్ హిట్ గా నిలిచిన కృష్ణ వంశీ మూవీ 'చందమామ'లో మొదట అడివి శేషే హీరోనట. నవదీప్ స్థానంలో మొదట తనని పెట్టి రెండు రోజులు షూట్ చేశారని, కానీ తర్వాత ఎందుకో తీసేశారని శేష్ చెప్పుకొచ్చాడు.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.