English | Telugu

ప్రేమ ఎంత మధురం సీరియల్ కి నాలుగేళ్ళు.. ఎలా ఉందంటే!

జీ తెలుగులో ప్రసారమయ్యే సీరియల్స్ లలో ప్రేమ ఎంత మధురం, త్రినయని సీరియల్స్ కి ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంది‌. అయితే ఇందులో ప్రేమ ఎంత మధురం సీరియల్ మొదలై నాలుగేళ్ళు పూర్తయిందంట. అను, ఆర్యవర్థన్ ల ప్రేమ కావ్యం ప్రేక్షకులకు ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలని ఇచ్చిందంటూ హెచ్ కె వర్ష తన ఇన్ స్ట్రాగ్రామ్ లో ఓ వీడియోని షేర్ చేసింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది.

ప్రేమ ఎంత మధురం సీరియల్ లో అను, ఆర్యవర్థన్ ల ఆన్ స్క్రీన్ మీద చేసే నటనకి ఫ్యాన్స్ చాలానే ఉన్నారు. 'ప్రేమ ఎంత మధురం' .. జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్. ఇందులో శ్రీరామ్ వెంకట్ మరియు వర్ష హెచ్ కె నటించారు. ఇది మరాఠీ టీవీ సిరీస్ 'తులా పహతే రే' యొక్క అధికారిక రీమేక్ . ఈ సీరియల్ 10 ఫిబ్రవరి 2020 న మొదలైంది. సాయి వెంకట్ దర్శకత్వం వహిస్తున్న 'ప్రేమ ఎంత మధురం' సీరియల్ కి శ్రీరామ్ వెంకట్ నిర్మాతగా చేస్తున్నాడు.

ఈ సీరియల్ కథ విషయానికొస్తే.. టికెఆర్ కళాశాల ఆర్యవర్ధన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు తన కారుకు జరిమానా విధించినందున అతను కళాశాలకు సైకిల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దురదృష్టవశాత్తు, అతని సైకిల్ పంక్చర్ అయింది, కాబట్టి అతను ఆటోలో కాలేజీకి వెళ్తాడు. ఆ ప్రయాణంలో కాలేజీ ఫంక్షన్‌లో తనకు స్వాగతం పలికేందుకు స్పీచ్‌ని సిద్ధం చేస్తున్న అనును కలుస్తాడు. రెండు రూపాయలకు కూడా విలువ ఇచ్చే ఆమె తత్వానికి అతను ముగ్ధుడవుతాడు. ఆర్య వర్ధన్ ఈ ఫిలాసఫీని ఉపయోగించి 10rs రీఛార్జ్ కార్డ్ ధరను 8rs కి తగ్గించాడు. ఇది వర్ధన్ కంపెనీకి భారీ లాభాన్ని అందించింది. దాంతో అతను అనుకు తన కంపెనీలో ఉద్యోగం కూడా ఇచ్చాడు. అలా ఒకే కంపెనీలో ఉండేసరికి వారిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. అయితే అను తల్లి తన మేనల్లుడు సంపత్‌ని పెళ్లి చేసుకునేందుకు అనును ఒప్పించాలని ఆర్య వర్ధన్‌ని కోరింది. ఆర్య వర్ధన్ సంపత్‌ని పెళ్లి చేసుకోమని అడుగగా.. అను గుండె ముక్కలైనంత పని అయింది. అను సంపత్‌తో పెళ్లికి అంగీకరిస్తుంది. తరువాత, సంపత్ తండ్రి రఘుపతి తన కంపెనీతో వ్యాపార సంబంధాల కోసం వివాహాన్ని ఉపయోగించుకుంటున్నాడని ఆర్య వర్ధన్ తెలుసుకుంటాడు.

అతను రఘుపతి యొక్క నిజమైన ఉద్దేశ్యాన్ని అను కుటుంబానికి తెలిసేలా చేస్తాడు. దాంతో అను పెళ్ళి ఆగిపోతుంది. అతని కంపెనీకి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన జెండే ఆర్య వర్ధన్ కి ప్రాణస్నేహితుడు. అతని పతనానికి అను కారణం కావచ్చని అనుకొని తనకి ఆర్యవర్థన్ ని దూరంగా ఉండమని హెచ్చరిస్తాడు. కాబట్టి ఆర్య వర్ధన్ అనును వైజాగ్‌కు బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాడు కానీ అతను అను పట్ల తనకున్న భావాలను గ్రహించి తన మనసు మార్చుకుంటాడు‌. మరియు ఆమెను తిరిగి హైదరాబాద్‌కు తీసుకువచ్చాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందనదే మిగతా కథ.