English | Telugu

పేరు మార్చుకున్న అషు రెడ్డి....సక్సెస్ పరుగులు తీస్తుందా ?

బిగ్ బాస్ హాట్ క్యూటీ అష్షు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాలా...ఆమె గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. అలాంటి అష్షు ఇప్పుడు పేరు మార్చుకుంది. పేరు మార్పు అంటే పూర్తి పేరు మార్చేసుకుంది అనుకునేరు. కాదండి ఒక లెటర్ ఎక్స్ట్రా చేర్చుకుందన్న మాట. అసలే అమ్మడుకు జాతకాలు, న్యూమరాలజీ ఇవన్నీ అంటే పిచ్చి. ఐనా కొంతకాలం నుంచి అష్షు లైమ్ లైట్ లో సరిగా కనిపించట్లేదు. తనకు టైం కలిసి రావడం లేదు అని చాలా ఫీలవుతోంది. దాంతో ఆమె వేణు స్వామిని కూడా సంప్రదించి పూజలు గట్రా చేయించడంతో పాటు ఆశీర్వాదాలు కూడా తీసుకుంది. ఇక న్యూమరాలజీ ప్రకారం అష్షు రెడ్డి పేరును కాస్తా ఆషురెడ్డిగా మార్చుకుంది. తన పేరులో కొత్తగా మరో A అక్షరాన్ని యాడ్ చేసింది.

విరాట్ కోహ్లీ మీ గల్లీలో వచ్చి ఆడతాడా..? గెస్ట్ ని ఇలా అవమానిస్తారా ?

యాంకర్ రవి గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఫిమేల్ యాంకర్స్ లో శ్రీముఖికి ఎంత పేరుందో మేల్ యాంకర్స్ లో రవికి అంత పేరుంది. ఐతే రీసెంట్ గా రవి దావత్ షోలో కనిపించాడు. ఇక హోస్ట్ రీతూ చౌదరి ఎన్నో ప్రశ్నలు వేసింది. "మీరు పక్కా కమర్షియల్ అంట కదా" అనేసరికి "అవును నేను డబ్బు కోసమే చేస్తా విరాట్ కోహ్లీ ఫ్రీగా వచ్చి మీ గల్లీల్లో ఆడతాడా..." అని రివర్స్ లో అడిగాడు. "ఐతే ముందు నేను కొరియోగ్రాఫర్ కావాలని ఇండస్ట్రీలోకి వచ్చి చాలామందిని కలిసాను. అప్పుడు ఒక పెద్దమనిషి నాగార్జున ఏమన్నారంటే ముందు పని నేర్చుకో అని చెప్పి తీసుకెళ్లి మా మ్యూజిక్ లో ఒక షో చేయమన్నారు.

సదా మీద ఫైర్ ఐన ఆరియానా...వాళ్ళ మీద ఈగ కూడా వాలనివ్వరు

నీతోనే డాన్స్ 2 .0 లో కొత్త కొత్త విషయాలు జరుగుతున్నాయి. ప్రతీ వారం లాగే ఈ వారం ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో అరియనా-అవినాష్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే మానస్- సుబ్బు జోడీలో సుబ్బుకి హెల్త్ బాలేని కారణంగా మానస్ ఒక్కడే షోకి వచ్చాడు. ఐతే మరి జోడీ ఎవరు నీకు అని శ్రీముఖి అనేలోపు వెనక నుంచి భానుశ్రీ ఎంట్రీ ఇచ్చింది.  "అబ్బాయి అబ్బాయి డాన్స్ చేయకూడదు..అబ్బాయి అమ్మాయి డాన్స్ చేయాలి" అని శ్రీముఖి అనేసరికి అందరూ నవ్వేశారు. అలాగే అమరదీప్ - తేజస్విని గౌడ ఇద్దరూ ఈ షోలో కనిపించారు. ఐతే ఈ వారం ఎపిసోడ్ లో రెండు జంటల మధ్య గట్టిగా యుద్ధం జరగబోతోందన్న విషయం ప్రోమో ద్వారా తెలుస్తోంది. అదే అవినాష్ - అరియానా, విశ్వా-నయని పావని జంటల మధ్య మార్కుల యుద్ధం జరిగింది.  

గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం మనీ డొనేట్ చేసిన బ్రహ్మముడి మానస్

రాబోయే ఆదివారం మదర్స్ డే సందర్భంగా స్టార్ మా ఛానెల్ మదర్స్ డే స్పెషల్ ప్రోగ్రాంని ప్లాన్ చేసింది. అమ్మ ప్రేమలో కమ్మదనాన్ని చూపించడానికి ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేసింది స్టార్ మా. బుల్లితెర సెలబ్రిటీలు తమ తల్లుల గురించి చెప్పడంతో పాటు వాళ్లకు ఎన్నో గిఫ్ట్స్ కూడా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. రౌడీ రోహిణి తన తల్లిని తీసుకొచ్చింది..రోహిణితో సమానంగా వాళ్ళ అమ్మ కూడా పంచులు పేల్చింది. అలాగే తల్లికి ఒక ఇంటిని కొని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక బ్రహ్మముడి శ్రీకర్ తన తల్లి కోసం గజ్జెలు తెచ్చి గిఫ్ట్ చేసాడు.  ఆమె ఎపుడో వదిలేసినా క్లాసికల్ డాన్స్ చేసి అందరినీ అలరించింది. ఇక కార్తీక దీపం 2 లో నటిస్తున్న చిన్నారి చైత్ర "ఎవరు రాయగలరు" అనే సాంగ్ పాడి అందరినీ కంటతడి పెట్టించింది. ఇక భానుశ్రీ గురించి చెప్పాక్కర్లేదు. వాయిస్ అబ్బాయిలా ఉంటుందని చాలా కామెంట్స్ ని ట్రోల్స్ ని కూడా ఎదుర్కొంది. అలాంటి భానుశ్రీ వాళ్ళ అమ్మను స్టేజి మీదకు తీసుకొచ్చింది.