త్వరలో తెరపడనున్న 134 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న అయోద్య వివాదం...
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పు పైనే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది, నూట ముప్పై నాలుగు ఏళ్ల నుంచి కొనసాగుతున్న వివాదానికి త్వరలో తెరపడనుంది. నవంబర్ 17 లోగా తుది తీర్పు రానుంది, చివరి రోజు కూడా అత్యున్నత న్యాయస్థానంలో వాడి వేడిగా వాదనలు జరిగాయి.