ఉద్రిక్తతకు దారి తీసిన ఆర్టీసీ జేఏసీ చేపట్టిన బైక్ ర్యాలీ...
ఆర్టీసీ జేఏసీ చేపట్టిన బైక్ ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. రాంనగర్ దగ్గర ప్రారంభించి సిటీలో అన్ని డిపోలను కలుపుతూ ర్యాలీ చేయాలనుకుంది జీఏసీ కానీ, సభలకు, ర్యాలీలకు అనుమతులు లేని కారణంగా వారిని ముందుగానే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా విద్యార్థులు నిర్వహించ తల పెట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు ముందస్తుగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు.