English | Telugu

ఆ మగాళ్లు సెక్సీగా ఉంటారంటున్న త్రిష..!

త్రిషాకృష్ణన్..ఒకప్పుడు సౌత్‌ని ఒక ఊపు ఊపిన హీరోయిన్. దక్షిణాదిన అందరు టాప్ హీరోల పక్కన నటించి నంబర్‌వన్‌గా వెలుగొందింది. ఇప్పుడు కొత్త హీరోయిన్ల దాటికి ఫేడవుట్ అయ్యే స్థితిలో ఆమెకు ఛాన్స్‌లు అంతగా రావడం లేదు. ప్రజంట్ నాయకి అనే లేడి ఓరియెంటేడ్ మూవీ చేస్తున్న త్రిష మరిన్ని ఆఫర్లు దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది. త్రిష గతంలో ఓ వ్యక్తిని ప్రేమించి, తన ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకెళ్లింది. అయితే అనుకోని కారణాల వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది. మ్యారేజ్ క్యాన్సిల్ అవడంతోనే తనకు మళ్లీ సుడి తిరిగింది. తెలుగు, తమిళ భాషాల్లో వరుస అవకాశాలొచ్చాయి. కెరిర్‌, చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి తాను తెలుసుకున్న విషయాల నుంచి మగాళ్లపై రీసెర్చ్ చేసింది. ఆ రీసెర్చ్‌లో నుంచి మగాళ్లు ఇలా ఉంటేనే నచ్చుతారని పెద్ద లెక్చర్ ఇచ్చింది.

*డేటింగ్ అనేది ప్లాన్ చేసుకుంటే జరిగేది కాదు..అమ్మాయి అబ్బాయి సహజంగా కలిసి నడిస్తేనే బాగుంటుంది.ప్లాన్ చేసుకుంటే అది కృత్రిమంగా ఉంటుందని చెప్పుకొచ్చిందట

* ఒకసారి మా క్లాస్‌మేట్ ఓ అబ్బాయి ఇంటికి వెళ్లాను, తను నా కోసం చాలా కష్టపడి వంట చేశాడు. అయితే ఏం వండాడో సరిగ్గా గుర్తులేదు కానీ, నా దృష్టిలో వంట చేసే మగాళ్లు చాలా సెక్సీగా ఉంటారు.

* అమ్మాయిల ఇష్టాఇష్టాలు గౌరవించి..ఎప్పుడూ నవ్విస్తూ ఉండేవారిని మగువలు గుండెల్లో పెట్టుకుంటారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.