English | Telugu

జన నాయగన్ రికార్డుని ఎవరైనా బద్దలు కొట్టగలరా!.. ఉంటే ఎవరు 


-ఏంటి ఆ రికార్డు
-జన నాయగన్ పై భారీ అంచనాలు
-అభిమానులు ఎంత మంది
-మలేషియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు


రికార్డులకి కొత్త పేర్లు వెతికే పనిని కోలీవుడ్ సినీ విశ్లేషకులకి ఇళయ దళపతి 'విజయ్'(Vijay)చాలా సార్లు కల్పించాడు. కానీ కొత్త పేర్లు కనుక్కొనే లోపే వెంటనే మరో కొత్త రికార్డుని విజయ్ సృష్టిస్తుండటంతో సినీ విశ్లేషకులు చేతులెత్తేశారు. అంతలా విజయ్ తన చిత్రాల ద్వారా ఎప్పటికప్పుడు సరికొత్త రికార్డులని సృష్టిస్తు వస్తున్నాడు. కానీ ఇప్పుడు సినిమా ఫంక్షన్ ద్వారా కూడా అదిరిపోయే రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

మొన్న శనివారం విజయ్ అప్ కమింగ్ మూవీ 'జన నాయగన్'(Jana Nayagan)ఆడియో లాంచ్ వేడుక మలేషియా(Malausia)దేశంలో జరిగిన విషయం తెలిసిందే. ఇండియా వెలుపల జరిగినా కూడా వరల్డ్ వైడ్ గా ఉన్న విజయ్ అభిమానులు మలేషియాకి క్యూ కట్టారు. ఇప్పుడు ఈ విషయంలోనే విజయ్ అరుదైన రికార్డుని అందుకున్నాడు. సుమారు 85000 మంది అభిమానులు ఆ ఈవెంట్ కి హాజరయ్యారు. దీంతో అవుట్ ఆఫ్ కంట్రీ లో జరిగిన తమిళ సినిమా ఆడియో ఈవెంట్ కి సంబంధించి ఆ స్థాయిలో ప్రజలు రావడం అదే తొలిసారి. దీంతో ఈ ఈవెంట్ మలేషియా బుక్ ఆఫ్ రికార్డులో అధికారకంగా చేరింది.


Also read:ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించిన అఖండ 2 టీం.. రేట్స్ ఇవే

ఇక జన నాయగన్ జనవరి 9 న వరల్డ్ వైడ్ గా విడుదల కానుండటంతో ఈ సారి అభిమానులు తమ గుండెల్లో ఆనందాన్ని, భావోద్వేగాన్ని మిక్స్ చేసుకొని మూవీని చూడనున్నారు. ఎందుకంటే జన నాయగాన్ విజయ్ ఆఖరి చిత్రం. ఈ మేరకు విజయ్ అధికారంగా చెప్పడమే కాకుండా పొలిటికల్ గా ప్రజలకి సేవ చేసేందుకే సినిమాలకి స్వస్తి చెప్పనున్నానని వెల్లడి చేసాడు. ఇక జన నాయగన్ లో విజయ్ కి జతగా పూజా హెగ్డే చేస్తుండగా, ప్రేమలు ఫేమ్ మమిత భైజు ఒక ముఖ్య పాత్రలో చేస్తుంది. హెచ్ వినోద్(H Vinoth)దర్శకత్వంలో కే వి ఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు. బాలకృష్ణ , అనిల్ రావిపూడి ల భగవంత్ కేసరి కథ, జన నాయగాన్ కి పోలి ఉండబోతోందనే టాక్ చాలా బలంగానే వినిపిస్తుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.