English | Telugu

ఏప్రిల్ 13న ' ఊపిరి ' థాంక్స్ మీట్‌..!

కింగ్‌ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మించిన భారీ మల్టీస్టారర్‌ 'ఊపిరి'. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25ప విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. యు.వెస్‌లో ఊపిరి స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ అవుతూ రెండు మిలియ‌న్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్ కు ద‌గ్గ‌ర‌వుతుంది.

ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ ''మా 'ఊపిరి' చిత్రానికి యునానిమస్‌గా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అనే టాక్‌ వచ్చింది. ఈమధ్యకాలంలో వచ్చిన కొన్ని సూపర్‌హిట్‌ చిత్రాల్లో 'ఊపిరి' కూడా ఒకటి కావడం ఆనందంగా వుంది. మనం, సోగ్గాడే చిన్నినాయ‌నా వంటి వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్స్ త‌ర్వాత నాగార్జునగారికి హ్యాట్రిక్‌ చిత్రంగా నిలిచిన 'ఊపిరి' ఈ సమ్మర్‌లో అత్యధికంగా కలెక్ట్‌ చేసే చిత్రం కాబోతోంది. ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. యు.ఎస్‌లో రెండు మిలియ‌న్స్ డాల‌ర్స్ క‌లెక్ష‌న్స్ కు ద‌గ్గ‌ర‌వుతుంది. ఇలాంటి హ్య‌ట్రిక్ స‌క్సెస్‌ల‌తో నాగార్జున‌గారు చాల హ్య‌పీగా ఉన్నారు. ఇంత‌టి ఘ‌న‌విజ‌యాన్ని అందించిన అక్కినేని అభిమానుల‌కు, తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 13న హైద‌రాబాద్ శిల్ప‌క‌ళావేదిక‌లో అశేష అక్కినేని అభిమానుల స‌మ‌క్షంలో `ఊపిరి` థాంక్స్ మీట్‌ను నిర్వ‌హిస్తున్నాం'' అన్నారు. నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్య పాత్రల్లో నటించిన ఊపిరి టాలీవుడ్ లో ఈ ఏడాది వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచి భారీ కలెక్షన్లు రాబడుతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.