English | Telugu

ఎమ్మెల్యేకు నరకంలో శిక్ష పడాలంటున్న త్రిష

హీరోయిన్ త్రిషకు మూగజీవాలంటే చాలా ఇష్టం. పెటా లాంటి జీవకారుణ్య సంస్థల తరపున ప్రచారం కూడా చేసింది. అవంటే అంత ప్రేమ ఉంది కాబట్టే ఆ ఎమ్మెల్యే పై ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. విషయంలోకి వెళ్తే, ఉత్తరాఖండ్ లో బిజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి అనే ఆయన, ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగాడు. దాన్ని చెదరగొట్టడానికి పోలీసులు గుర్రాలపై వచ్చారు. దాంతో ఎమ్మెల్యే గారికి కోపం పెరిగిపోయింది. పోలీసుల్ని ఏమీ చేయలేక తన కోపాన్ని గుర్రంపై చూపించాడు. లాఠీతో చితకబాదడంతో గుర్రం కాలు విరిగిపోయింది. చికిత్సలో భాగంగా ఆ గుర్రం కాలు తీసేయాలని వైద్యులు సూచించారు. మూగజీవాన్ని కనికరం లేకుండా కొట్టిన జోషికి నరకంలో శిక్ష పడుతుందంటూ ట్వీట్ చేసింది త్రిష. అయినా ఏ పాపం తెలియని ఆ మూగజీవాన్ని కొట్టడానికి ఆ ప్రజా ప్రతినిధికి మనసెలా వచ్చిందో.

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.