English | Telugu

జక్కన్నగా వస్తున్నాడు, హిట్ కొడతాడా..?

అందాల రాముడు సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ కు ఆ తర్వాత మర్యాదరామన్న తప్పితే, సరైన హిట్ పడలేదు. లేటెస్ట్ గా వచ్చిన కృష్ణాష్టమి కూడా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నింది. దీంతో ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న తన జక్కన సినిమా మీదే సునీల్ ఆశలన్నీ ఉన్నాయి. ఈ సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ హిట్ అవడం సునీల్ కు ఇప్పుడు అత్యవసరం. అందుకే ఈ భీమవరం బుల్లోడు జక్కన్న కోసం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ఆకెళ్ల వంశీకృష్ణ డైరెక్షన్లో సునీల్ చేస్తున్న సినిమా జక్కన్న. పూర్తి కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

చిన్న చిన్న కమెడియన్స్ కూడా, కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలు తీసి హిట్ కొడుతుంటే, స్టార్ కమెడియన్ గా వెలుగు వెలిగిన సునీల్ మాత్రం హిట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. తన సినిమాల్లో, హీరోగా చేస్తూనే తన నుంచి కామెడీని జనాలు ఎక్స్ పెక్ట్ చేస్తున్నారని సునీల్ కు ఈ పాటికే అర్ధమై ఉంటుంది. అందుకే, జక్కన్న సినిమా కోసం డైరెక్టర్ తో కలిసి కసరత్తులు చేస్తున్నాడట. కామెడీ డోస్ తో సినిమాను సక్సెస్ చేయాలనేది సునీల్ ఆలోచన. జక్కన్న అనేది టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళికి ఉన్న నిక్ నేమ్ కావడం విశేషం. ప్రేమకథాచిత్రమ్ నిర్మాత సుదర్శన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో సునీల్ తో మన్నారా చోప్రా జతకట్టబోతోంది. ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఉన్న సునీల్ మరి ఈ సారి ఎంత వరకూ సక్సెస్ అవుతాడో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.