English | Telugu

కరణ్ జోహార్ శ్వేతాబసుకు లైఫ్ ఇస్తాడా..!

కొత్త బంగారు లోకంతో, మంచి టాలెంట్ ఉన్న అమ్మాయిగా ప్రశంసలతో కెరీర్ ను మొదలెట్టింది శ్వేతా బసు ప్రసాద్. చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డు గెలిచినా శ్వేతకు తెలుగు సినిమా తర్వాతే గుర్తింపు లభించింది. ఆ తర్వాత సరైన అవకాశాలు లేకపోవడంతో తెరమరుగైన ఈ భామ, ఒక భారీ స్కాండల్ లో చిక్కుకుని కెరీర్ కు పూర్తిగా ఎర్త్ పెట్టేసుకుంది. ఆమె పేరైతే బయటికొచ్చింది కానీ, ఆ కేసులో నిజంగా ఆమె ఉందా..? ఉంటే ఆమె పాత్ర ఏంటి అనే కోణంలో పోలీసులకు పెద్దగా సాక్ష్యాధారాలు లభించలేదు. అదే సమయంలో, శ్వేతకు చాలా మంది మద్దతుగా నిలిచారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి ఎంతో మందికి ఆమెకు మానసిక స్థైర్యాన్నిచ్చారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత, శ్వేత ముంబై వెళ్లిపోయింది. యూట్యూబ్ ఛానల్ ఏఐబీ తీసిన ఒక కామెడీ పేరడీలో కనబడి సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మించే సినిమాలో శ్వేతాబసుకు అవకాశం దొరికిందట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం, శ్వేతాబసు కెరీర్ మళ్లీ పుట్టినట్టే. సినీఫీల్డ్ లో టాలెంట్ ఉన్నా, అదృష్టం లేకపోతే ఏమవుతుందో శ్వేతా కెరీరే ఒక ఉదాహరణ. ఏదేమైనా, ఆమె కెరీర్ మళ్లీ పుంజుకోవాలని ఆశిద్దాం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.