English | Telugu

బోయపాటికి బాలయ్యకు మధ్యలో చిరు.!

బోయపాటి శ్రీనుకి, బాలయ్యకి మధ్య చిరంజీవి మంటపెట్టడమేంటి అసలు ఎవరైనా నమ్ముతారా? వరుస ఫ్లాప్‌లతో కెరిర్ ఏమవుతుందో అన్న టైంలో సింహా లాంటి హిట్‌నిచ్చి బాలయ్యను మళ్లీ హీరోగా నిలబెట్టారు బోయపాటి. మళ్లీ 2014 వచ్చిన లెజెండ్‌ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడినా తక్కువే. లెజెండ్ సినిమా ఎన్నో రికార్డ్స్‌ని తిరగరాయడంతో పాటు 675 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఎలక్షన్ టైంలో రావడంతో అటు టీడీపీలోనూ జోష్ నింపింది. అప్పటి నుంచి నందమూరి అభిమానులు శ్రీనుకి బ్రహ్మరథం పట్టారు. అటువంటి బోయపాటి మీద బాలయ్య సీరియస్ అవ్వడమేంటి?

వివరాల్లోకి వెళితే సరైనోడు ఆడియో ఫంక్షన్‌లో చిరంజీవి మాట్లాడిన మాటలు నందమూరి అభిమానులకు ఆగ్రహాం తెప్పించాయి. సరైనోడు వేదిక మీద బోయపాటిని ప్రశంసలతో ముంచెత్తారు చిరు. అదే సందర్భంలో శ్రీను బాలయ్యతో తీసిన సింహా, లెజెండ్ కథలను ముందుగా తానే విన్నానని, దానిలో నేను చెప్పిన మార్పులను బోయపాటి పాటించారన్నారు. చిరు మాటలను బట్టి చూస్తే సింహా, లెజెండ్ సినిమాల హిట్ల వెనుక తాను ఉన్నానన్నట్టు చెప్పడంతో నందమూరి అభిమానులు హర్ట్ అయ్యారు. ఈ విషయం బాలయ్యకు చేరడంతో పాటు పలు ప్రాంతాల్లో ఫ్యాన్స్ బోయపాటి పోస్టర్లను తగలబెట్టె వరకు వచ్చింది. సో చిరు మాటలు బాలయ్య, బోయపాటి మధ్య చిచ్చు రాజేసినట్లే అంటున్నారు సినీ విశ్లేషకులు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.