English | Telugu

షారుఖ్ ఖాన్ ఫ్యాన్ కాంట్రవర్సీ..!

షారుఖ్ ఖాన్ హీరోగా, ఫ్యాన్ గా ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా ఫ్యాన్. ఆర్యన్ ఖన్నా అనే హీరోగా, గౌరవ్ అనే 20 ఏళ్ల వీరాభిమానిగా షారుఖ్ సినిమాలో జీవించాడు. ఇప్పటికే ట్రైలర్లు, టీజర్లతో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమాను ఈ నెలలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు మూవీ టీం. అయితే, తాజాగా ఈ సినిమాకు కాంట్రవర్సీ ఎదురైంది. తమిళ నిర్మాత మహేష్ థోయ్, తాను రిజిస్టర్ చేసుకున్న అభినేత అనే కథను, తన అనుమతి లేకుండా ఫ్యాన్ సినిమాగా తీశారని, ఆ స్టోరీని 1997లోనే తాను రిజిస్టర్ చేసుకున్నానని ఆరోపిస్తున్నారు. మనీష్ శర్మ, షారుఖ్ లు కనీసం తనను సంప్రదించకుండా, తన కథను కాపీ కొట్టారని, తనకు జరిగిన నష్టానికి పరిహారంగా 25 కోట్లు ఇప్పించాలని కేసు వేశారు. మరో వైపు మనీష్ వాదన మాత్రం భిన్నంగా ఉంది. ఈ సినిమా కథ తనకు తానుగా రాసుకున్నట్టు, కేవలం షారుఖ్ కోసమే ఈ కథను రెడీ చేసినట్టు ఆయన చెబుతున్నాడు. సినిమా చూసిన తర్వాత నిర్మాత మాట్లాడాలని, అసలు సినిమాలో ఏ కథ ఉందో కూడా తెలియకుండా తన కథ అంటూ కేసు వేయడం కరెక్ట్ కాదని మనీష్ వాదిస్తున్నాడు. ఇప్పుడు ఈ కేసుపై కోర్టు ఎలా తీర్పిస్తుందో, ఫ్యాన్ రిలీజ్ అవుతుందా, ఆగుతుందా అన్న ఆసక్తి బాలీవుడ్ వర్గాల్లో నెలకొంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.