English | Telugu

బాహుబ‌లిని స‌ర్దార్ ఇలాక్కూడా వ‌ద‌ల్లేదా..?

స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ టార్గెట్ ముందు నుంచీ బాహుబ‌లి సినిమానే. ప్రచార వ్యూహాల విష‌యంలో స‌ర్దార్ టీమ్ బాహుబ‌లినే ఫాలో అయ్యింది. బాహుబ‌లి రికార్డులు బ‌ద్ద‌లు కొట్టాల‌న్న ధ్యేయంతోనే.. భారీ ఎత్తున ఈ సినిమాని విడుద‌ల చేశారు. బాలీవుడ్‌లో బాహుబ‌లి ఇర‌గ‌దీసింద‌ని.. అక్క‌డా ఈ సినిమాని డ‌బ్ చేసి విడుద‌ల చేశారు. అలా అన్నిటా... సర్దార్ బాహుబ‌లిని టార్గెట్ చేశాడు. ఆఖ‌రికి సినిమా డైలాగుల్లోనూ... బాహుబ‌లిని ప‌రోక్షంగా ప్ర‌స్తావించిన‌ట్టు.. ప్ర‌భాస్‌ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. స‌ర్దార్‌లో 'రాజు'ల‌కు సంబంధించిన కొన్ని సంభాష‌ణ‌లు ఉన్నాయి. కాజ‌ల్ ది రాజ‌వంశం. ముఖేష్ రుషి పాత్ర‌ని 'రాజుగారు' అని సంబోధిస్తుంటాడు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. 'యుద్దానికి వెళ్లిన వాడు ప్ర‌తి ఒక్క‌డూ రాజు కాలేడు.. యుద్ధంలో గెలిచిన‌వాడే రాజు అవుతాడు' అన్న డైలాగ్ కూడా ఈ సినిమాలో వాడారు. యుద్ధం అంటే బాహుబ‌లి అని.. రాజు అంటే ప్ర‌భాస్ అని కొత్త అర్థాలు వెదుక్కొంటున్నారు ప్ర‌భాస్‌ఫ్యాన్స్‌.

భీమ‌వ‌రం ఏరియాలో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఎక్కువ‌. దానికి తోడు ప‌వ‌న్ ఫ్యాన్స్‌కీ ప్ర‌భాస్ ఫ్యాన్స్ కీ అక్క‌డ ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. ప‌వ‌న్ ఫ్లెక్సీలు ప్ర‌భాస్‌ఫ్యాన్స్ పీకేశార‌ని ఓసారి, ప్ర‌భాస్ పోస్ట‌ర్ల‌ను ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌గ‌ల‌బెట్టార‌ని మ‌రోసారి వారిద్ద‌రి మ‌ధ్య గొడ‌వ‌లు రాజుకొన్నాయి. రాజు - కాపు మ‌ధ్య ఓ ర‌క‌మైన యుద్ద‌వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ సినిమాలోనూ రాజు - కాపు కులాల ప్ర‌స్తావ‌న తీసుకురావ‌డంతో మ‌ళ్లీ భీమ‌వ‌రంలో ఈ రెండు వర్గాల మ‌ధ్య వేడి రాజుకొంది. ప‌వ‌న్ అండ్ కో ఈ డైలాగ్‌ని ఉద్దేశ పూర్వ‌కంగా వాడి ఉండ‌క‌పోవచ్చు. కానీ ఇలాంటి సెన్సిటీవ్ విష‌యాల్ని మ‌రింత సెన్సిటీవ్‌గా ఆలోచించి డీల్ చేయాల్సింది. కానీ.. ఇప్ప‌టికే లేట్ అయిపోయింది. భీమ‌వ‌రం మ‌ళ్లీ రాజుకొంటోంది. మ‌రి.. ఈ మంట‌ల‌ను ఆర్పేదెవ‌రు?? సినిమాని సినిమాగా చూస్తే ఎవ్వ‌రికీ ఏ గొడ‌వా ఉండ‌దు. ఈ విష‌యంలో ఆలోచించాల్సింది అభిమానులే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.