English | Telugu

కట్టప్ప బాహుబలిని చంపలేదట..!

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..? గతేడాది ఇండియా వైడ్ మారుమోగిపోయిన క్వశ్చన్ ఇది. రాజమౌళి, విజయేంద్రప్రసాద్ లు ఎక్కడికెళ్లినా వాళ్లకు ఇదే ప్రశ్న ఎదురయ్యేది. ఎలాగో కష్టపడి దీని బారి నుంచి బయటపడేవారు. విజయేంద్రప్రసాద్ అయితే, ఒకడుగు ముందుకేసి తానే ఏదో ఒక ఎదురు ప్రశ్న వేసి కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బాహుబలిని కట్టప్ప పొడిచాడు అంతే అని గతంలో ఒక ఇంటర్వ్యూలో సమాధానం చెప్పిన ప్రసాద్, రీసెంట్ గా ఇదే ప్రశ్నకు అసలు బాహుబలి చనిపోయాడని ఎందుకు అనుకుంటున్నారు అని ఎదురు ప్రశ్న వేశారు. దీంతో ఇప్పుడు ప్రేక్షకులకు కొత్త ట్విస్ట్ ఎదురైంది. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. సినిమాలో ప్రతీ పాత్ర కూడా మహాభారత, రామాయణాల్లో పాత్రల నుంచి స్ఫూర్తిగా తీసుకున్నదే అని ఆయన చెబుతున్నారు. శివగామిలో కైకేయి, గాంధారి, కుంతీదేవి ఛాయలుంటే, బిజ్జలదేవుడిలో శకుని యాంగిల్ ఉంటుందని, భల్లాలదేవుడిలో రావణుడు, ధుర్యోధనుడు, బాహుబలి పాత్రలో రాముడు, అర్జునుడు కనిపిస్తారని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఇంతకీ, రెండో పార్ట్ లో బాహుబలి మళ్లీ వస్తాడా..? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే, వచ్చే ఏడాది ఏప్రిల్ 14 వరకూ ఆగాల్సిందే మరి..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.