English | Telugu

సరైనోడు ట్రైలర్ టాక్ : ఊర మాస్..!

రొటీన్ కు భిన్నంగా, ఆడియోను రిలీజ్ చేసేసి ఆ తర్వాత సక్సెస్ మీట్ ను నిర్వహించారు సరైనోడు టీం. ఈ సందర్భంగా, మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బోయపాటి మార్క్ కనబడుతూ, అల్లు అర్జున్ స్టైలిష్ నెస్ తో, ఫైట్స్ తో ట్రైలర్ ను నింపేశారు. ట్రైలర్ బట్టి చూస్తే సినిమా అంతా ఫైటింగ్సే ఉంటాయేమో అన్న ఫీలింగ్ రాకమానదు. ఎంత మాస్ డైరెక్టరైతే మాత్రం, మొత్తం ఫైటింగ్స్, గన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే చూపిస్తే ఎలా అనే డౌట్ కూడా వస్తుంది.

" ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు. దమ్ము. టన్నులు టన్నులుందింకా..చూస్తావా ", " ఎనీ టైం, ఎనీవేర్, ఎనీ బడీ..నేను రెడీ..." ఈ రెండే ట్రైలర్లో వినిపించే డైలాగులు. ఇంకెవరి డైలాగులూ లేవు. సినిమా ఎలా ఉంటుంది అన్న ఐడియాను ముందే ఈ ట్రైలర్ ద్వారా అల్లు అండ్ కో ఇచ్చేశారు. విలన్ ను ఇసుకలో పడేసి బన్నీ నడుస్తుంటే, పక్కనే గుర్రం జంప్ చేసే లాస్ట్ షాట్ ట్రైలర్ కు హైలెట్. మొత్తం అన్ని షాట్లూ స్లో మోషన్లోనే కనిపిస్తాయి. ఓవరాల్ గా, ఫస్ట్ రిలీజైన టీజర్లో బన్నీ చెప్పిందే రైటు. ఈ సినిమా అతని గత సినిమాల్లాగా లేదు. పూర్తి సీరియస్ క్యారెక్టర్ తో ఫుల్ లెంగ్త్ మాస్ యాక్షన్ హీరోగా బన్నీ కనిపించబోతున్నాడని అర్ధమవుతోంది. ట్రైలర్ గ్యారంటీగా ఊర మాసే..!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.