English | Telugu

సర్దార్ గబ్బర్ సింగ్ ను చంపేసిన చిన్న పిల్లాడిని చూడండి..!

సర్దార్ గబ్బర్ సింగ్ దేశవ్యాప్తంగా రిలీజైంది. డివైడ్ టాక్ ఉన్నా, ఇప్పటి వరకైతే కలెక్షన్ల పరంగా బాగానే ఉంది. కానీ హిందీలో మాత్రం సర్దార్ పరిస్థితి ఘోరంగా ఉంది. పబ్లిసిటీ కూడా సరిగ్గా లేకపోవడంతో సినిమాకు ఓపెనింగ్స్ లేవు. సర్దార్ తో పాటు రిలీజైన జంగిల్ బుక్ బాగుండటంతో, సర్దార్ హాల్స్ లో కూడా జంగిల్ బుక్ ను బుక్ చేసేస్తున్నారు. దీంతో బాలీవుడ్ లో పవన్ సినిమా పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.

మరో వైపు ఎప్పటికప్పుడు పవన్ పై కామెంట్స్ చేయడానికి రెడీ గా ఉండే రాంగోపాల్ వర్మ, మళ్లీ తనదైన శైలిలో సర్దార్ పై సెటైర్లు వేయడం మొదలెట్టారు. సర్దార్ గబ్బర్ సింగ్ ను, రాజా సర్దార్ గబ్బర్ సింగ్ ను చంపేసిన చిన్నపిల్లాడిని చూడండి అంటూ జంగిల్ బుక్ లో మోగ్లీ క్యారెక్టర్ వేసిన పిల్లాడి ఫోటో పెట్టారు వర్మ గారు. అంతేకాదు. పవన్ ఇకనైనా నిద్రలేవాలని, ఆయన్ను నిద్రలేపాల్సిన బాధ్యత పవన్ ఫ్యాన్స్ దేనంటూ ట్వీటారు. మరో వైపు తనమీద వర్మ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా పవన్ మాత్రం వర్మంటే తనకు ఇష్టం అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.