English | Telugu

సల్మాన్ పోటీ నుంచి తప్పుకున్న షారుఖ్ ఖాన్..!

బాలీవుడ్ లో ఖాన్ లదే రాజ్యం. వారిలో కూడా షారుఖ్, సల్మాన్ ల మధ్య పోటీ ఎక్కువగానే ఉంటుంది. వీళ్లిద్దరి సినిమాలు వస్తున్నాయంటే, మిగిలిన హీరోలకు దడే. షారుఖ్ రయీస్, సల్మాన్ సుల్తాన్ సినిమాలు రెండూ ఈద్ పండగకు రావాలని ఫిక్స్ అయ్యాయి. జూలై 6 డేట్ నే రెండు సినిమాలూ లాక్ చేసుకున్నాయి. ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేసారి రావడం అంత మంచిది కాదనే అభిప్రాయంలో బాలీవుడ్ పెద్దలు ఈ సినిమాల ప్రొడ్యూసర్లతో మాట్లాడటంతో, పోటీనుంచి షారుఖ్ రయీస్ తప్పుకుంది. సినిమా రిలీజ్ ను నిర్మాత రితేష్ సిధ్వానీ మరో రెండు వారాలు ముందుకు పోస్ట్ పోన్ చేశాడు. దీంతో బాలీవుడ్ బాక్సాఫీస్ కు దడ తగ్గింది. ఈద్ సల్మాన్ కు ప్రతీ ఏడాదీ కలిసొస్తున్న రోజు. సల్మాన్ సూపర్ హిట్ సినిమాలు చాలా వరకూ ఈద్ కే రిలీజయ్యాయి. అందుకే సల్మాన్ కోసం షారుఖ్ వెనక్కి తగ్గాడట. కానీ వెనక్కి తగ్గి సినిమా రిలీజ్ ను ముందుకు జరిపినా, హృతిక్ రోషన్ హైబడ్జెట్ మూవీ మొహంజదారో తో షారుఖ్ పోటీ పడే అవకాశం ఉంది. ఏదైమైనా ఈ వేసవి బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఊరిస్తోంది. మరి క్యాష్ చేసుకునేదెవరో చూడాలి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.