English | Telugu

సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ రివ్యూ

సర్దార్ గబ్బర్ సింగ్ టీజర్ రిలీజైంది. ఎవరికి ఎలా ఉన్నా, పవన్ ఫ్యాన్స్ మాత్రం టీజర్ చూసి వెర్రెత్తిపోతున్నారు. ముఖ్యంగా పవన్ ఇంట్రో.టవల్ ఎగురుతుండగా ఫేస్ కనబడకుండా కేవలం గ్లాసెస్ మాత్రమే కనబడేలా ఒక షాట్ ఉంటుంది. ఆ ఒక్క షాట్ కోసమే మళ్లీ మళ్లీ టీజర్ చూస్తున్నవాళ్లున్నారు.ఒక్క డైలాగ్ కూడా లేకుండాటీజర్ ను వదిలి పవన్ స్టామినాను ప్రూవ్ చేశారు మూవీ టీం. గబ్బర్ సింగ్ లాగే, ఈ సినిమాలోకూడా, పవన్ కు బైక్, గుర్రం, జీప్ ఉంటాయట.

టీజర్లో బైక్ మీద వచ్చే సీన్, గుర్రం మీద వచ్చే సీన్ పెట్టారు. రెండింటిలోనూ పవన్ ఫేస్ పూర్తిగా కనబడదు. ఆ తర్వాతి నుంచి పవన్ అండ్ జబర్దస్త్ టీం కామెడీ ఎలా ఉండబోతుందో చూపించే షాట్స్ ఇన్వాల్వ్ చేశాడు డైరెక్టర్. చెక్కగుర్రం మీద కూర్చుని పవన్ ఆడుకోవడం ఫ్యాన్స్ ను విపరీతంగా నవ్విస్తుంది.

ఇక లాస్ట్ ఎండింగ్ షాట్ మాత్రం పీక్స్. పిల్లలందరూ గబ్బర్ సింగ్ గెటప్ లో పవన్ వెనక పరిగెత్తుకురావడంతో హి ఈజ్ బ్యాక్ టు డూ సమ్ థింగ్ అనిపించాడు డైరెక్టర్. కానీ పవన్ డైలాగ్ విందామని ఆశపడ్డ వాళ్లు మాత్రం 20 వ తేదీ వరకూ ఆగాల్సిందే..

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.