English | Telugu

'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్.. మరో కేజీఎఫ్ అవుతుందా..?

సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'సంబరాల ఏటి గట్టు'. రోహిత్ కె.పి. దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. భారతదేశానికి స్వాతంత్య్రం రావడానికి ముందు.. రాయలసీమ ప్రాంతంలో కరవును అంతం చేయడానికి తపనపడే మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కథగా 'సంబరాల ఏటి గట్టు' చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ విడుదలైంది. (Sambarala Yeti Gattu Glimpse)

నేడు(అక్టోబర్ 15) సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా 'సంబరాల ఏటి గట్టు' గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. నిమిషం నిడివితో రూపొందించిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. మైన్స్ లో బానిసల్లా పని చేస్తున్న ప్రజల తరపున నిలబడి, పోరాడే యోధుడిలా సాయి ధరమ్ తేజ్ పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీ సెటప్.. కేజీఎఫ్ ప్రపంచాన్ని గుర్తు చేసేలా ఉంది. ఇక సాయి తేజ్ మేకోవర్ కూడా మెప్పించింది. సరికొత్త అవతారంలో కనిపిస్తున్నాడు. "అసుర సంధ్య వేళ మొదలైంది. రాక్షసుల ఆగమనం" అంటూ సాయి తేజ్ చెప్పిన డైలాగ్ కట్టిపడేసింది. మూవీ సెటప్, సాయి తేజ్ లుక్, యాక్షన్, విజువల్స్, బీజీఎం ప్రతిదీ ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్, సాలిడ్ పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

అఖండ 2 ఆగినప్పుడు తెరవెనుక ఉంది వీళ్లే.. గంగాధర శాస్త్రి చెప్పిన పచ్చి నిజాలు  

నందమూరి నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishana)పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద 'అఖండ 2'(Akhanda 2)తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్నాడు. దీంతో హిట్ ల శాతం తక్కువగా ఉన్న ప్రస్తుత సినీ యుగంలో వరుసగా ఐదు విజయాలని అందుకున్న హీరోగా  చరిత్రనే సృషించాడు . కలెక్షన్స్ పరంగా కూడా అఖండ 2 తొలి రోజు వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ తో కలుపుకొని 59 .5 కోట్ల రూపాయిల గ్రాస్ ని అందుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. మేకర్స్ కూడా త్వరలోనే రెండు తెలుగు రాష్టాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ ని జరుపుతున్నారు.

Akhanda 2: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్ 

గాడ్ ఆఫ్ మాసెస్ 'బాలకృష్ణ'(Balakrishna)మరోసారి సిల్వర్ స్క్రీన్ పై 'అఖండ 2'(Akhanda 2)తో తన సత్తాని చాలా స్పష్టంగా చాటుతున్నాడు. ప్రీమియర్స్ నుంచే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ భారీగా థియేటర్స్ కి పోటెత్తారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా అఖండ 2 థియేటర్స్ దగ్గర పండుగ వాతావరణం కనిపించింది. మూవీ చూసిన అభిమానులు, ప్రేక్షకులు స్పందిస్తు 'అఖండ క్యారక్టర్ లో బాలయ్య తన కళ్ళతోనే క్యారక్టర్ యొక్క స్వరూపాన్ని ప్రదర్శించాడు. దీంతో మరోసారి బాలయ్య నట విశ్వరూపాన్నిచూసే అవకాశం లభించింది. బోయపాటి(Boyapati Srinu)బాలయ్య కాంబో మరో సారి మెస్మరైజ్ చేసిందని ముక్త కంఠంతో చెప్తున్నారు. దీంతో తొలి రోజు బాలకృష్ణ రికార్డు కలెక్షన్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.