English | Telugu
మెహర్ రమేష్ తో పవన్ కళ్యాణ్ మూవీ డీటెయిల్స్ ఇవే! ఫ్యాన్స్ లో టెన్షన్
Updated : Oct 15, 2025
తన కట్ అవుట్ కి తగ్గ సినిమా పడితే ఎలా ఉంటుందో 'ఓజి'(OG)తో పవన్ కళ్యాణ్(Pawan Kalyan)మారోమారు నిరూపించాడు. పైగా పవర్ స్టార్ అనే బిరుదుకి తగట్టుగా సినిమా మొత్తం పవర్ ఫుల్ గా ఉండటంతో, పవన్ నుంచి ఇలాంటి సినిమాలు కదా ఆశిస్తుందని అభిమానులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు కూడా ఇలాంటి చిత్రాల్లోనే పవన్ నటించాలని, డైరెక్టర్స్ విషయంలో శ్రద్ధ వహించాలని సోషల్ మీడియా వేదికగా కోరుతు వస్తున్నారు. ఇక పవన్ రీసెంట్ గా మాట్లాడుతు ఓజి సీక్వెల్ తో పాటు సినిమాల్లో కంటిన్యూ అవుతానని చెప్పిన విషయం తెలిసిందే. దీంతో పలువురు దర్శకులు పవన్ కి కథ చెప్పి ఒప్పించాలనే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వస్తున్నాయి.
ఆ దర్శకుల్లో మెహర్ రమేష్(Meher Ramesh)పేరు కూడా వినిపిస్తుంది. పవన్ తో సినిమా కోసం మెహర్ స్క్రిప్ట్ ని రెడీ చేసుకోవడంతో పాటు, పవన్ కి కథ చెప్పాడనే వార్తలు ఇపుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. పవన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అని కూడా అంటున్నారు. దీంతో పవన్ అభిమానుల్లో టెన్షన్ మొదలయ్యింది. వాళ్ల టెన్షన్ కి కారణం లేకపోలేదు. మెహర్ రమేష్ గత కొంత కాలం నుంచి వరుస ప్లాప్ లని చవి చూస్తున్నాడు. పైగా ఆ చిత్రాలని ప్లాప్ లు అనే కంటే, సినీభాషలో భారీ డిజాస్టర్స్ అని చెప్పవచ్చు. సదరు చిత్రాల్లోని కథ, కథనం, హీరో క్యారక్టరయిజేషన్ ఏ మాత్రం మెప్పించలేకపోయాయి. సినిమా ప్లాప్ అయినా అభిమానులకి తమ హీరో పెర్ఫార్మ్ నచ్చడం అనేది కామన్. కానీ అందుకు విరుద్ధంగా మెహర్ రమేష్ సినిమాలో తమ హీరో ఉంటాడనే కామెంట్స్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎప్పట్నుంచో చేస్తూ వస్తున్నారు. ఇందుకు ఎన్టీఆర్ 'శక్తి' ,వెంకటేష్ నుంచి వచ్చిన 'షాడో' లే ఉదాహరణ. షాడో వచ్చిన పది సంవత్సరాల తర్వాత చిరంజీవి ఎంతో నమ్మకంతో భోళా శంకర్ తో అవకాశమిచ్చాడు. కానీ ఈ చిత్రం కూడా ఏ ఒక్క అంశంలోను మెప్పించలేదు.
చిరంజీవి కెరీర్ లోనే వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలవడమే కాకుండా, క్యారక్టర్ ప్రెజెన్స్ పరంగా విమర్శలు వచ్చాయి. దీంతో ఇప్పడు పవన్ ని ఒప్పించే ప్రయత్నాలో మెహర్ రమేష్ ఉన్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ భయపడుతున్నారు. కెరీర్ స్టార్టింగ్ లో మెహర్ రమేష్ మంచి విజయాలనే అందుకున్నాడు. 2004 లో పునీత్ రాజ్ కుమార్ హీరోగా కన్నడ లో తెరకెక్కిన 'వీర కన్నడిగా' చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఈ చిత్రం ఎన్టీఆర్, పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన 'ఆంధ్రావాలా' కి రీమేక్ గా తెరకెక్కింది. కమర్షియల్ గా విజయం సాధించడంతో మహేష్ ఒక్కడు రీమేక్ ని పునీత్ తోనే చేసి మరో విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత తెలుగులో ప్రభాస్ బిల్లా తో మోస్తరు హిట్ ని అందుకున్నాడు. మెహర్ రమేష్ పవన్ కళ్యాణ్ కి స్వయానా బంధువు. పవన్ కి పిన్ని కొడుకు అవుతాడు.