English | Telugu

పవన్ మీద చిరు సెటైర్ వేశారా..?

నిన్న వైజాగ్ లో సరైనోడు ఆడియో సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా వారు మాట్లాడిన స్పీచ్ వెనుక అంతరార్ధమేంటన్నది ఇప్పుడు సినీ జనాల్లో మైండ్స్ లో మెదులుతున్న ప్రశ్న. " అవకాశాలు రావడం ఒక ఎత్తు. ఆ ప్లాట్ ఫాం ను నిలబెట్టుకోవడం మరో ఎత్తు. అభిమానుల చేత శభాష్ అనిపించుకోవడం మాత్రం హీరోల చేతుల్లోనే ఉంది. వెనకాల మెగాస్టార్ ఉన్నాడు. మెగాఫ్యాన్స్ రెడీమేడ్ గా ఉన్నారు. మాకేమీ తిరుగులేదు అని ధీమాతో ఉంటే ఎదురుదెబ్బ తినే అవకాశాలున్నాయి " ఇవీ మెగాస్టార్ చెప్పిన మాటలు. ఈ మాటలు సర్దార్ గురించేనా అనేది ఇప్పుడు ప్రతీ ఒక్కరి మదిలో ఉన్న ప్రశ్న. ఈ మాటలు చెప్పే సమయంలో చిరంజీవి ఎక్స్ ప్రెషన్స్ కూడా కాస్త సెటైరికల్ గాఉండటం విశేషం. సర్దార్ గబ్బర్ సింగ్ కోసం పవన్ కష్టపడినప్పటికీ, సినిమా ఎలా ఉన్నా ప్రేక్షకులు ఆదరించేస్తారని, అభిమానుల్ని లైట్ గా తీసుకున్నారనే అభిప్రాయంలో ఉన్నారనే మాట సినిమా రిలీజ్ తర్వాత వినిపించింది. తెర మీద తనొక్కడే నడిపించగలననుకోవడం కూడా సర్దార్ కు దెబ్బేసింది. ఈ విషయమ్మీదే చిరు వ్యంగ్యాస్త్రాలు వదిలారనే మాట ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తోంది. లేదంటే, చిరుకు ఆడియో సక్సెస్ మీట్ లో ఈ విషయం మాట్లాడాల్సిన అవసరమేముందో...!

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.